Begin typing your search above and press return to search.

అలియాభ‌ట్ కి మ‌హేష్ స‌పోర్ట్?

సోషల్ మీడియా వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకుంది. తాజాగా 'పోచ‌ర్' ని సూపర్ స్టార్ మ‌హేష్ సైతం మెచ్చారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 11:50 AM GMT
అలియాభ‌ట్ కి మ‌హేష్ స‌పోర్ట్?
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ నిర్మాత‌గానూ స‌క్సెస్ లో దూసుకుపోతుంది. గ‌తేడాది 'డార్లింగ్స్' తో నిర్మాత‌గా ప‌రిచ‌యం అయిన అలియా తొలి ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలోనూ అలియా విజ‌య‌కేతనం ఎగ‌రేసిన సంగ‌తి విధిత‌మే. అమెజాన్ తో క‌లిసి నిర్మించిన 'పోచ‌ర్' అనే వెబ్ సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ అయింది.

ఫిబ్ర‌వ‌రి 23 అమెజాన్ లో రిలీజ్ అయిన సిరీస్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టు కుంటోంది. కంటెంట్ ప్రధానంగా తెర‌కెక్కిన సిరీస్ అనుకున్న దానికంటే ఎక్కువ‌గానే రీచ్ అయింది. తొలి రోజు 'పోచ‌ర్' రికార్డు సృష్టించ‌డంతో అలియా అనందంతో ఉబ్బితబ్బింది. సోషల్ మీడియా వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకుంది. తాజాగా 'పోచ‌ర్' ని సూపర్ స్టార్ మ‌హేష్ సైతం మెచ్చారు.

'ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో హ్యుమానిటీ ఉండదా..? ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి' అంటూ ఎమోషనల్ అవుతూ రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. మ‌రి మ‌హేష్ పోస్ట్ పై అలియా రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

2015 బ్యాక్ డ్రాప్ లో సాగే సిరీస్ ఇది. నిమిషా సైజ‌యాన్ (మాల‌) తండ్రి చేసిన పాపానికి ప‌రిహారంగా అడ‌విలోని వ‌న్య‌మృగాల్ని ర‌క్షించాల‌నుకుంటుంది. ఏనుగు దంతాల కోసం 18 ఏనుగుల్ని చంపేసారు అన్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో మాల షాక్ అవుతుం ది. ఇది మూల క‌థ అక్క‌డ నుంచి క‌థ ఎలా సాగింది అన్న‌ది ఆస‌క్తిక‌రం. నిమిషా స‌జ‌య‌న్...రోష‌న్ మ్యాథ్యూ..దివేంద్రు భ‌ట్ట‌చార్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్ ఇది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.