Begin typing your search above and press return to search.

మహేశ్, నమ్రత.. వ్వాటే క్యూట్

ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా లో షేర్ చేశారు. మహేశ్ బాబు గారాల పట్టి సితార చాలా క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:36 PM GMT
మహేశ్, నమ్రత.. వ్వాటే క్యూట్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫారిన్ లో ఉన్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలతో పాటు యాడ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో నమ్రతా కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేశారు. మహేష్ పర్ఫెక్ఫ్ ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ తో రెగ్యులర్ గా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు.


మహేశ్ ప్రతి పండుగను, ఈవెంట్ ను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు మహేశ్. తాజాగా న్యూ ఇయర్ 2024కు వెల్ కమ్ చెప్తూ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా లో షేర్ చేశారు. మహేశ్ బాబు గారాల పట్టి సితార చాలా క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ పెంచారు. నమ్రతతో కలిసి దిగిన క్యూట్ ఫోటోను ఇన్స్టా లో షేర్ చేశారు. Spontaneity. Laughter. Love. Adventure. Growth. #HappyNewYear #2024 అంటూ అభిమానులకు విషెష్ చెప్పారు.

ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ గా మారింది. కపుల్ అంటే మేదేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. అన్న వదిన ఫోటో అంటూ రీ షేర్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ యాడ్ షూట్స్ లో ఎక్కువగా బిజీ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆమెనే.

మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కానుంది. మహేశ్ సరసన శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని నిర్మిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలట్ త్వరలోనే విడుదల కానుంది.