Begin typing your search above and press return to search.

హాలిడేస్ లో కూడా ఆదాయం పెంచుతున్న మహేష్

గురువారమే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసేసారు మేకర్స్.

By:  Tupaki Desk   |   30 Dec 2023 2:28 PM GMT
హాలిడేస్ లో కూడా ఆదాయం పెంచుతున్న మహేష్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ల్యాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎట్టకేలకు రెండు రోజుల క్రితమే షూటింగ్ని ముగించుకుంది. గురువారమే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసేసారు మేకర్స్.

ఇన్ని రోజులుగా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ ఇక షూటింగ్ పూర్తి అవడంతో మళ్ళీ ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్ వేశాడు. ఈసారి న్యూ ఇయర్ వెకేషన్ ని దుబాయ్ లో ప్లాన్ చేశాడు. శుక్రవారం మహేష్, నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి దుబాయ్ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఫ్యామిలీతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్లడంతో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లారని అనుకున్నారు. కానీ మరొక కారణం కూడా ఉంది.

మహేష్ దుబాయ్ వెళ్ళింది సెలబ్రేషన్స్ కోసం మాత్రమే కాదు. ఓ యాడ్ షూట్ కోసం కూడా వెళ్ళాడు. మహేష్ బాబు దుబాయ్ లో ఓ యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అదే విషయాన్ని నేడు మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఓ ఫోటోని పంచుకున్నారు. మహేష్ నమ్రత ఇంకా కొంతమంది టెక్నీకల్ టీమ్ తో కలిసి వున్న ఫొటోలో మహేష్ బాబు స్టైలిష్ గా కుర్చీలో కూర్చోగా.. మహేష్ టీమ్ తో కలిసి సందడి చేసిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మహేష్ తో పాటూ అతను కూర్చున్న మడత కుర్చీ కూడా ఈ పిక్ లో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ యాడ్ మౌంటెన్ డియోకి సంబంధించిందని తెలుస్తోంది. కాగా ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ మహేష్ డెడికేషన్ కి ఫిదా అవుతుంటే నెటిజన్స్ మాత్రం హాలిడేస్ లో కూడా మహేష్ మరింత ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక యాడ్ షూట్ పూర్తి కాగానే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్ ముగించుకుని మళ్ళీ జనవరి 5 న మహేష్ అండ్ ఫ్యామిలీ ఇండియాకి రానుంది. వెకేషన్ నుంచి వచ్చిన వెంటనే మహేష్ గుంటూరు కారం ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు. జనవరి 6 నుంచి మహేష్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్టు తెలిసింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది తమన్ సంగీతం అందిస్తుండగా జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.