Begin typing your search above and press return to search.

నీ వెంటే మేము అంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..!

కానీ ఈసారి ఆ బాధ్యత మీది.. నాకు మీరే రికార్డులు, కలెక్షన్స్ గురించి చెప్పాలి.. ఇక నుంచి అమ్మా నాన్నా అన్నీ మీరే అంటూ ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పాడు మహేష్.

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:45 AM GMT
నీ వెంటే మేము అంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..!
X

ఇక నుంచి నాకు అమ్మా నాన్నా అన్నీ మీరే అన్న మహేష్ మాటలకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి చూపించిన ఈ మార్గాన్ని ఆయన పేరుని ఇంకాస్త పెంచేలా చేస్తూ వచ్చాడు మహేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన మహేష్ సినీ ప్రస్థానం హీరోగా మారి ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ తనయుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ తానొక సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.

తనదైన ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ తన మార్క్ చాటుతూ తెలుగు సినిమా స్టామినా తెలియచేస్తూ వచ్చాడు మహేష్. కేవలం సినిమా హీరోగానే కాదు తన మంచి మనసుతో ఎంతోమంది చిన్నారి హృదయాలకు కాపలాగా నిలిచాడు. చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కు మహేష్ ఫౌండేషన్ చేసే సహాయం తెలిసిందే. సినిమాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు వాడుతుంటాడు మహేష్.

మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుండగా ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ ప్రతి సూపర్ స్టార్ అభిమానిని టచ్ చేసింది. ప్రతి సినిమా రిలీజ్ తర్వాత నాన్న గారు కాల్ చేసి అది కలెక్ట్ చేసే కలెక్షన్స్, రికార్డుల గురించి ప్రస్తావిస్తారు ఈసారి ఆయన లేరు కొత్తగా ఉంది.

కానీ ఈసారి ఆ బాధ్యత మీది.. నాకు మీరే రికార్డులు, కలెక్షన్స్ గురించి చెప్పాలి.. ఇక నుంచి అమ్మా నాన్నా అన్నీ మీరే అంటూ ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పాడు మహేష్. తమ అభిమాన నటుడి ఫ్యాన్స్ ని అమ్మా నాన్నలుగా భావించడం ప్రతి సూపర్ స్టార్ అభిమాని చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. మహేష్ స్పీచ్ అనంతరం సోషల్ మీడియాలో మహేష్ వెంటే మేముంటాం అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా హారిక హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు.