Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ కు ఓ మంచి గుడ్ న్యూస్

ఇక, హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన తన గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనాలి అని అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   11 Aug 2023 12:30 PM GMT
మహేష్ ఫ్యాన్స్ కు ఓ మంచి గుడ్ న్యూస్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూసే. ఎందుకంటే, మహేష్ గత నెలలో తన ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి స్కాట్లాండ్ కూడా వెళ్లారు. తన పుట్టిన రోజు కూడా ఆయన అక్కడే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు మహేష్ తన ట్రిప్ ముగించుుకొని ఇండియా వచ్చేశారు. ఈ రోజే ఆయన హైదరాబాద్ చేసుకున్నారు.

ఇక, హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన తన గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనాలి అని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా, వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయంలో మహేష్ అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన షూటింగ్ ని మొత్తం పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారట.

త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోకుంటే, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే, మహేష్ పుట్టిన రోజు నాడు కూడా మూవీ టీమ్ ఇచ్చిన అప్ డేట్ కి వారు సంతృప్తి చెందలేదు. కనీసం టీజర్, లేదంటే ఏదైనా పాట విడుదల చేస్తారని అనుకున్నారు.

కానీ, మూవీ టీమ్ సింపుల్ గా ఓ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ అయితే నచ్చింది కానీ, వారు కోరుకున్నది లభించకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. ఇక, మహేష్ ట్రిప్ నుంచి వచ్చేశాడు, త్రివిక్రమ్ కూడా మరే ఇతర మూవీ పనులు ఏమీ లేవు కాబట్టి, ఇక ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వచ్చేవారం నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇక, ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో మరదలి పాత్ర చేస్తోందట. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేన్స్ నిర్మిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సర్కారువారి పాట ప్లాప్ తో ఉన్న మహేష్ కి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.