Begin typing your search above and press return to search.

నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ కోసం మహేష్ సపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:54 AM GMT
నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ కోసం మహేష్ సపోర్ట్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగానే షూటింగ్ నవంబర్ ఆఖరుకి ఫినిష్ చేసేలా త్రివిక్రమ్ వరుస షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు కూ బల్క్ కాల్ షీట్స్ ఈ చిత్రం కోసం కేటాయించారు.

దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ కోసం సూపర్ స్టార్ సిద్ధమవుతారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది ఆఖరుకి స్క్రిప్ట్ కంప్లీట్ కావడంతో పాటు మూవీ ఓపెనింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజమౌళితో సినిమా స్టార్ట్ చేసేలోపు మహేష్ బాబు మరో సినిమాని కంప్లీట్ చేస్తాడా అంటే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

తనతో దూకుడు, ఆగడు సినిమాలని నిర్మించిన అనిల్ సుంకరతో మూవీ చేయడానికి మహేష్ బాబు కమిటయ్యాడంట. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాకి కూడా అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ ఏడాది ఏజెంట్, భోళా శంకర్ సినిమాలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తో అనిల్ సుంకర దారుణంగా నష్టపోయారు. ఒకదానిని మించి మరొకటి నిర్మాతకి నష్టాలు తీసుకొచ్చాయి.

ఓ విధంగా అనిల్ సుంకర కెరియర్ లో ఈ రెండు చిత్రాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయాలని అనిల్ సుంకర డిసైడ్ అయ్యారంట. మహేష్ బాబు కూడా అనిల్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్ది మూవీ చేసేందుకు ఒప్పుకున్నారంట. అయితే ఈ చిత్రం రాజమౌళి సినిమా కంటే ముందే ఉంటుందా లేదంటే తరువాత అనేది తెలియాల్సి ఉంది.

ఒక వేళ ముందుగానే ఉంటే 6 నుంచి 8 నెలల్లో పూర్తయిపోవచ్చు. కానీ జక్కన్న సినిమా తర్వాత అంటే మాత్రం రెండు, మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మహేష్ తో సినిమా చేయాలంటే 200 నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. మరి ఈ ప్రాజెక్ట్ ముందే ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.