Begin typing your search above and press return to search.

ప్లైట్ ఎక్కేసిన మ‌హేష్ ఫ్యామిలీ!

తాజాగా ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ ప్లైట్ ఎక్కేసారు. నేటి ఉద‌య‌మే మ‌హేష్ ...న‌మ్ర‌త‌..గౌత‌మ్..సితార ఎయిర్ పోర్టులో బ్యాగుల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 5:16 AM GMT
ప్లైట్ ఎక్కేసిన మ‌హేష్ ఫ్యామిలీ!
X

అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. సూపర్ స్టార్ మ‌హేష్ అండ్ ఫ్యామిలీ ఎప్పుడు ప్లైట్ ఎక్కుతుందా? అని కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ ప్లైట్ ఎక్కేసారు. నేటి ఉద‌య‌మే మ‌హేష్ ...న‌మ్ర‌త‌..గౌత‌మ్..సితార ఎయిర్ పోర్టులో బ్యాగుల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో వెకేష‌న్ అని క‌న్ప‌మ్ అయింది. అయితే ఈసారి దుబాయ్ వెకేష‌న్ తో పాటు ఓ చిన్న యాడ్ కూడా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.


ఒకేసారి రెండు ప‌నులు ముగించుకోవాల‌ని ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. న్యూఇయ‌ర్ వేడుక‌లు దుబాయ్ లో సెల‌బ్రేట్ చేసుకుని...అటుపై యాడ్ షూడ్ కూడా ముగించుకుని తిరుగు ప్ర‌యాణం షురు చేస్తారు. ఇక మ‌హేష్ హీరోగా న‌టిస్తోన్న 'గుంటూరు కారం' షూటింగ్ కూడా ముగిసిన‌ట్లు తెలుస్తోంది. నిన్న‌టితోనే త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. అందుకే మ‌హేష్ ధీమాగా ప్లైట్ ఎక్కేస్తున్నారు.


అలాగే షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే వెకేష‌న్ కి వెళ్ల‌డం ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు అన్న సంగ‌తి తెలిసిందే. ఓ ప‌ది రోజుల పాటు విదేశాలు చెక్కేసి రిలాక్స్ అయి వ‌స్తారు. తిరిగొచ్చిన అనంత‌రం మ‌హేష్ గుంటూరు కారం డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టే అవ‌కాశం ఉంది. అలాగే రాజ‌మౌళి ద‌ర్శ‌క త్వంలో ఓపాన్ ఇండియా సినిమా షూటింగ్ కూడా వ‌చ్చే ఏడాది మొద‌లవుతుంది.

దానికి సంబంధించి ముందొస్తుగా కొంత స‌న్న‌దం కావాల్సి ఉంది. ఆ సినిమా షూట్ ప్రారంభ‌మ‌య్యే లోపు ప్రిప‌రేష‌న్ తో పాటు మ‌రో వెకేష‌న్ ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే రాజ‌మౌళి సినిమా షూటింగ్ మొద‌లైందంటే? మ‌హేష్ కి ఊపిరి పీల్చుకునే స‌మ‌యం కూడా ఉండ‌దు. డే వ‌న్ నుంచి షూట్ పూర్త‌య్యే వ‌ర‌కూ రాజ‌మౌళితోనే ఉండాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మ‌హేష్ కి ఆ ర‌క‌మైన ఒత్తిడైతే త‌ప్ప‌దు.