Begin typing your search above and press return to search.

ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఆ రేంజ్ 22కేనా?

అంటే ప్ర‌ముఖంగా ఇద్ద‌రు హీరోలు హైలైట్ అవుతున్నారు. వాళ్లే సూప‌ర్ స్టార్ మ‌హేష్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

By:  Tupaki Desk   |   12 May 2025 5:30 PM
ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఆ రేంజ్ 22కేనా?
X

టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు నాలుగైదు లైన్ లో ఉన్నాయి. అన్నింటిపైనా భారీ అంచ‌నా లున్నాయి. రామ్ చ‌ర‌ణ్ 'పెద్ది', ప్ర‌భాస్ 'పౌజీ', ఎన్టీఆర్' డ్రాగ‌న్', ఎస్ ఎస్ ఎంబీ 29, బ‌న్నీ22వ చిత్రాల‌పై స‌మ అంచ‌నాలున్నాయి. వీటిలో భారీ క్రేజ్ ఉన్న చిత్రాలేవి? అంటే ప్ర‌ముఖంగా ఇద్ద‌రు హీరోలు హైలైట్ అవుతున్నారు. వాళ్లే సూప‌ర్ స్టార్ మ‌హేష్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రంపై గ్లోబ‌ల్ స్థాయిలో బ‌జ్ క్రియేట్ అవుతుంది. బాహుబ‌లి, ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాల‌తో రాజ‌మౌళి క్రేజ్ హాలీవుడ్ కి సైతం తాక‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టే జ‌క్క‌న్న అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేసి ప‌ట్టాలెక్కించారు. ప్ర‌స్తుతం ఉన్న అన్ని పాన్ ఇండియా చిత్రాల‌కంటే టాప్ స్థానంలో ఉన్న చిత్ర మేది? అంటే ఎస్ ఎస్ ఎంబీ 29 అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అటుపై ఆ రేంజ్ అంచ‌నాలు ఏ సినిమాపై ఉన్నాయంటే? ఐకాన్ స్టార్ తో అట్లీ తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మే. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన 'జ‌వాన్' భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత అట్లీ హీరో అవ్వ‌డం బ‌న్నీ ఒక ఎత్తైతే? అట్లీ క‌మ‌ర్శియాల్టీకి టెక్నిక‌ల్ అంశాలు జోడించ‌డం మ‌రో ఎత్తులా మారింది.

దుబాయ్ లో ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు నిర్వ‌హించ‌డం...న్యూయార్క్ స్టూడియోల‌తో ఒప్పందాలు చేసు కోవ‌డం... బ‌న్నీ క్యారెక్ట‌ర్ ను కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నాడ‌నే అంశాలు ఈ రేంజ్ బజ్ కి కార‌ణంగా మారాయి. ఐకాన్ స్టార్ ని ఎలా ఎలివేట్ చేస్తున్నార‌నే ప్ర‌చారం పీక్స్ లో జ‌రుగుతోంది. స‌న్ పిక్చ‌ర్స్ వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు బ‌లంగా వినిపిస్తుంది. దీంతో మ‌హేష్‌-బ‌న్నీ చిత్రాలు మార్కెట్ లో క్రేజీ ప్రాజెక్ట్ లుగా మారాయి.