Begin typing your search above and press return to search.

సితార వారి క్రేజీ సీక్వెల్.. ప్లాన్ సెట్టు బాబు!

రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది.

By:  Tupaki Desk   |   30 March 2024 5:45 PM GMT
సితార వారి క్రేజీ సీక్వెల్.. ప్లాన్ సెట్టు బాబు!
X

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. ఇటీవల రిలీజైన టిల్లు స్క్వేర్ అందుకు ఉదాహరణ. రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది.

ఇక గత ఏడాది రిలీజైన మ్యాడ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. 2023లో విడుదలైన చిన్న సినిమాల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యారు. ఆయనతోపాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా యాక్ట్ చేశారు.

గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ వచ్చింది. టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మ్యాడ్ సీక్వెల్ పై స్పందించారు ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. మ్యాడ్ మ్యాక్స్ పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.

మ్యాడ్ ఫస్ట్ పార్ట్ లో చేసిన నటీనటులతో సెకండ్ పార్ట్ కూడా తెరకెక్కించనున్నారట మేకర్స్. మ్యాడ్ మూవీ అంతా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగగా.. సీక్వెల్ మాత్రం ఆ ముగ్గురు కుర్రాళ్లు బయట ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.. టిల్లు స్క్వేర్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. సెకండాఫ్ లో మంచి డైలాగులు అందించినది కళ్యాణేననట.

మ్యాడ్ ను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సీక్వెల్ ను కూడా సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా కూడా మంచి లాభాలు కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో తన కామెడీతో అలరించిన జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ కేవీ అనుదీప్.. సీక్వెల్ లో కూడా లీడ్ రోల్ పోషించనున్నారట. మరి మ్యాడ్ మ్యాక్స్.. తెలుగు సినీ ప్రియులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.