Begin typing your search above and press return to search.

400 కోట్ల ఆస్తులున్న మేటి క‌థానాయిక‌

అయితే మాధురి ధీక్షిత్ త‌న సుదీర్ఘ‌మైన‌ కెరీర్ లో ఏ మేర‌కు ఆస్తుల‌ను సంపాదించారు? అన్న‌దానికి స‌మాధానం దొరికింది.

By:  Tupaki Desk   |   26 May 2025 4:02 AM
400 కోట్ల ఆస్తులున్న మేటి క‌థానాయిక‌
X

త‌న‌దైన అందం, డ్యాన్సింగ్ సామ‌ర్థ్యం, అద్భుత‌ న‌ట‌ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ సంపాదించిన మేటి క‌థానాయిక మాధురి ధీక్షిత్. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన మాధురి అక‌స్మాత్తుగా అభిమానుల హృద‌యాల‌ను గాయ‌ప‌రుస్తూ, ప్ర‌ముఖ డాక్ట‌ర్ శ్రీ‌రామ్ నీనేను పెళ్లాడి అమెరికాలో సెటిల‌య్యారు. కానీ 2011లో తిరిగి వ‌చ్చి సొంతంగా సినిమా నిర్మాణ సంస్థ‌ను స్థాపించి, న‌టిగాను రీఎంట్రీ ఇచ్చారు.

అయితే మాధురి ధీక్షిత్ త‌న సుదీర్ఘ‌మైన‌ కెరీర్ లో ఏ మేర‌కు ఆస్తుల‌ను సంపాదించారు? అన్న‌దానికి స‌మాధానం దొరికింది. మాధురి త‌న కాలంలో అత్యధిక పారితోషికం అందుకున్న మేటి క‌థానాయిక‌. త‌న సంప‌ద‌ల్ని ప‌లు వ్యాపారాల్లోను తెలివిగా పెట్టుబ‌డులు పెట్టారు. బాలీవుడ్ మీడియాల క‌థ‌నాల ప్ర‌కారం మాధురి ధీక్షిత్ నిక‌ర‌ ఆస్తుల విలువ 250 కోట్లు. ఆమె భ‌ర్త డాక్ట‌ర్ శ్రీ‌రామ్ నీనే ఆస్తులు సుమారు 150 కోట్లు. ఈ రెండిటినీ క‌లుపుకుంటే 400 కోట్ల నిక‌ర ఆస్తులు వారి సొంతం.

ఇక మాధురి ధీక్షిత్ భ‌ర్త గురించి చెప్పాల్సి వ‌స్తే.. అత‌డు గుండె శ‌స్త్ర చికిత్స నిపుణుడు. అమెరికాలో విజ‌య‌వంత‌మైన ఎంట‌ర్ ప్రెన్యూర్. అత‌డు భారతదేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ రంగంలో రాణిస్తున్నారు. పాత్‌ఫైండర్ హెల్త్ సైన్సెస్ కంపెనీని శ్రీ‌రామ్ నీనే ప్రారంభించారు. ఇది మాత్రమే కాదు ఐఐటి- జోధ్‌పూర్ సలహా బోర్డులో కూడా ఒక స‌భ్యుడిగా ఉన్నారు.

దాదాపు 70 పైగా చిత్రాల్లో న‌టించిన మాధురి ధీక్షిత్ ఇటీవ‌ల భూల్ భుల‌యా 3లో న‌టించింది. ఈ సినిమా దాదాపు 400కోట్లు వ‌సూలు చేసింది. మాధురి దీక్షిత్ ప్రతి చిత్రానికి రూ. 4-5 కోట్లు వసూలు చేస్తుంది. ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగానే ఆర్జిస్తోంద‌ని స‌మాచారం.