Begin typing your search above and press return to search.

మా కాళీ.. పీపుల్స్ మీడియా డేరింగ్ ప్రాజెక్ట్

ఇప్పుడు ఈ సంస్థ నుంచి రాబోయే సినిమాలు ఊహించిన విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది

By:  Tupaki Desk   |   4 March 2024 7:30 AM GMT
మా కాళీ.. పీపుల్స్ మీడియా డేరింగ్ ప్రాజెక్ట్
X

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలను తెరపైకి తీసుకు వస్తున్న ఈ సంస్థ ఒకవైపు చిన్న సినిమాలు మాత్రమే కాకుండా మరొకవైపు పెద్ద హీరోలతో కూడా బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది. అలాగే అప్పుడప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి రాబోయే సినిమాలు ఊహించిన విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈరోజు 'మా కాళీ' అనే సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక మోషన్ పోస్టర్లో సినిమాకు సంబంధించిన అంశాలను హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. భారత దేశంలోనే బెంగాల్లో చెరిపి వేయబడిన ఒక చరిత్రను సంబంధించిన అంశాలను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా చాలా సెన్సిటివ్ పాయింట్స్ తో తెరపైకి రాబోతున్నట్లుగా అర్థమవుతోంది.

అలాగే సినిమాలో మత ఘర్షణలకు సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అయితే ఒకవైపు కాళీమాతను మరొకవైపు బుర్కాతో ఉన్న మహిళను హైలెట్ చేశారు. పోస్టర్ ద్వారానే సినిమాలో రెండు మతాలకు సంబంధించిన పాయింట్స్ ఉంటాయని చెప్పకనే చెప్పేశారు.ముఖ్యంగా మత యుద్ధాలకు సంబంధించిన సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి మోషన్ పోస్టర్ ద్వారానే సినిమాలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఒక డేరింగ్ డిఫరెంట్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా లో ప్రముఖ టాలెంటెడ్ హీరోయిన్ రీమాసేన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అభిషేక్ సింగ్ మరికొందరు స్టార్స్ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

పీపుల్స్ మీటర్ ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ ఏలకంటి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాకు అనురాగ్ సంగీతం అందిస్తుండగా ఆచార్య వేణు సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. చూస్తుంటే ఈ సినిమా హాట్ టాపిక్ గా నిలిచే అవకాశం ఉంది.