Begin typing your search above and press return to search.

ఆ సినిమాని మించి ప్లాన్ చేస్తున్నాడా?

ఇటీవ‌లే లోకేష్ హైద‌రాబాద్ వ‌చ్చి నాగార్జున‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 5:53 AM GMT
ఆ సినిమాని మించి ప్లాన్ చేస్తున్నాడా?
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రాన్ని లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ తో లోకేష్ మార్క్ చిత్ర‌మ‌ని తేలిపోయింది. ఇందులో ర‌జ‌నీ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ర‌జ‌నీ మాస్ ఇమేజ్ కి లోకేష్ మార్క్ యూనివ‌ర్శ్ తోడైతే ఎలా ఉంటుందో చూపించ బోతున్నాడు. ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు శ్రుతి హాస‌న్ ని ఎంపిక చేసారు. తాజాగా సినిమాలో కింగ్ నాగార్జున కూడా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇటీవ‌లే లోకేష్ హైద‌రాబాద్ వ‌చ్చి నాగార్జున‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది.


దీంతో ఈ సినిమాని లోకేష్ `విక్ర‌మ్` చిత్రాన్ని మించి ప్లాన్ చేస్తున్నాడా? అన్న సందేహం మొద‌లైంది. `విక్ర‌మ్` లో హీరో? విలన్ ఎవ‌రు? అన్న‌ది ఓ స‌స్పెన్స్. కమ‌ల్ హాస‌న్ తో పాటు విజ‌య్ సేతుప‌తి..ప‌హ‌ద్ పాస‌ల్ లాంటి స్టార్ న‌టీనటుల‌తో తెర‌కెక్కించిన చిత్ర‌మ‌ది. తాజాగా 171వ లో నాగార్జున పేరు కూడా తెర‌పైకి రావ‌డంతో భారీ కాన్వాస్ పైనే తెర‌కెక్కిస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. లోకేష్ సినిమాలో పాత్ర‌లు ఎంత బ‌లంగా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోకి ధీటుగా ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటిని తీర్చిదిద్దుతాడు.

త‌న‌దైన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ నింప‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. దీంతో 171 తొలుత వేసిన అంచ‌నాల‌కంటే రెట్టింపు బ‌జ్ క్రియేట్ అవ్వ‌డం ఖాయం. ప్ర‌స్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. మ‌రో రెండు మూడు నెలల్లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. దీంతో లోకేష్ న‌టీన‌టుల ఎంపిక ప‌నుల్లోనూ త‌లమున‌క‌లై ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.

ర‌జ‌నీకాంత్ పాత్ర‌కి హీరోయిన్ ఉండ‌ద‌ని మ‌రోవైపు ప్ర‌చారం సాగుతోంది. శ్రుతి హాస‌న్ ఎంపికైన నేప‌థ్యంలో ఆ పాత్ర నాగ్ కి జోడీగా క‌నిపిస్తుందా? అన్న‌ది సందేహం. మ‌రి ఇందులో ఏది నిజ‌మ‌వుతుందో చూడాలి. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ 170వ చిత్రానికి `జైభీమ్` ద‌ర్శ‌కుడు జ్ఞాన్ వేల్ తెర‌కెక్కిస్తున్నారు. సామాజిక ధృక్కోణంలో కోర్ట్ వార్ డ్రామాగా తెర‌కెక్కిన `జైభీమ్` అవార్డులు...రివార్డులు అందుకోవ‌డంతోనే ర‌జ‌నీ ఛాన్స్ ఇచ్చారు.