Begin typing your search above and press return to search.

తలైవాతో కమల్ హాసన్.. వ్వాటే మూమెంట్

ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. ఇక రజినీకాంత్ కమల్ హాసన్ మళ్ళీ చాలా రోజుల తరువాత అనుకోకుండా కలుసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 11:50 AM GMT
తలైవాతో కమల్ హాసన్.. వ్వాటే మూమెంట్
X

తమిళ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోలైన సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనయకుడు కమల్ హాసన్ ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన విధానం ఫ్యాన్స్ ఎప్పటికి మరచిపోలేరు. బాలచందర్, భారతిరాజా వంటి దర్శకులతో ఈ ఇద్దరు చేసిన సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక దాదాపు ఇద్దరు స్టార్ ఇమేజ్ ఒకేసారి పెరిగుతూ వచ్చింది.


ఒకరు నటన సముద్రంలో మునిగి తేలితే మరొకరు స్టైల్ కా బాప్ అనే బిరుదుతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఇక ఈ ఇద్దరు కూడా వారి సినిమా జీవితంలో ఎంతో స్నేహంగా కొనసాగుతూ వస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. ఇక రజినీకాంత్ కమల్ హాసన్ మళ్ళీ చాలా రోజుల తరువాత అనుకోకుండా కలుసుకున్నారు.


ప్రస్తుతం రజినీకాంత్ 170వ సినిమాను లైకా ప్రొడక్షన్ లో జ్ఞాన్ వెల్ రాజా దర్శకత్వంలో చేస్తున్నాడు. అలాగే కమల్ హాసన్ అదే ప్రొడక్షన్ లో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవల లైకా ప్రొడక్షన్ ఒకే స్టూడియో లో ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను కొనసాగిస్తూ ఉండగా గ్యాప్ లో రజినీకాంత్ కమల్ హాసన్ ఇలా కలుసుకున్నారు.


ఒకరికొకరు వారి సినిమాలకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను కూడా లైకా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఇరు వర్గాల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక చాలాకాలం తర్వాత ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ లను అందుకున్న విషయం తెలిసిందే.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కమల్ కెరీర్ బిగ్ హిట్ చూశాడు. అలాగే మరోవైపు వరుస డిజాస్టర్స్ చూసిన రజినీకాంత్ కు జైలర్ సినిమా మళ్ళీ పోయిన మార్కెట్ ను వెనక్కి తీసుకొచ్చింది. ఇక రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 అనంతరం మణిరత్నం సినిమాతో మరింత బిజీ కానున్నాడు.