ఇదంతా బాలీవుడ్ ఎంట్రీ కోసమేనా?
సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. నటిగా, యాంకర్ గా, హోస్ట్ గా, నిర్మాతగా పలు రంగాల్లో సక్సెస్ అయి లక్ష్మి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 31 May 2025 10:31 AMసినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. నటిగా, యాంకర్ గా, హోస్ట్ గా, నిర్మాతగా పలు రంగాల్లో సక్సెస్ అయి లక్ష్మి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి ఆ తర్వాత సొంతంగా ఎదిగి తన సత్తా చాటింది. అయితే గత కొన్నేళ్లుగా మంచు లక్ష్మి టాలీవుడ్ లో చాలా తక్కువగా కనిపిస్తోంది.
లక్ష్మి ఆఖరిగా డిస్నీ హాట్ స్టార్ లో గతేడాది వచ్చిన యక్షిణి వెబ్ సిరీస్ లో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే మంచు లక్ష్మి ఓ సంవత్సరం నుంచి ముంబైని తనహోమ్ గా మార్చేసుకుంది. అప్పుడప్పుడు మాత్రమే టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తూ వస్తోంది. అయితే మంచు లక్ష్మి ముంబై ఎందుకెళ్తుందనేది ఇప్పుడొక క్లారిటీ వచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నుంచి ది ట్రయేటర్స్ అనే రియాలిటీ షో రాబోతుంది. అందులో లక్ష్మీ మంచు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ రియాలిటీ షోకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవగా అందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి లక్ష్మి కనిపించింది. రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో ఈ రియాలిటీ షో జరుగుతుంది.
కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ కానుంది. ఈ షో లో మంచు లక్ష్మితో పాటూ పురవ్ ఝా, హర్ష్ గుజ్రాల్, కరణ్ కుంద్రా, అపూర్ అకా రెబెల్ కిడ్, ఆశిష్ విద్యార్థి, ఉర్ఫీ జావేద్, జాస్మిన్ బాసిన్, రఫ్తార్, నికితా లూథర్, ఎల్నాజ్ నొరౌజీ, అన్షులా కపూర్, రాజ్ కుంద్రా, మహీప్ కపూర్, జాన్వీ గౌర్, జన్నత్ జుబైర్, ముఖేష్ చబ్రా, సుధాన్షు పాండే, సాహిల్ సలాథియా, సూఫీ మోతీవాలా పాల్గొననున్నారు. ది ట్రయేటర్స్ తో లక్ష్మి అందరినీ ఆకట్టుకుంటే బాలీవుడ్ లో తన ఎంట్రీకి రూట్ క్లియర్ అయినట్టే అవుతుంది.