Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం

వేసింది. కానీ బాక్సాఫీస్ మాత్రం పూర్తిగా భిన్నమైన అంశాల‌కు సంబంధించిన‌ద‌ని మరోసాని నిరూప‌ణ అయింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా తిర‌స్క‌రించారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 6:41 AM GMT
బాలీవుడ్‌లో భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం
X

తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిన క్ర‌మంలో ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు బాలీవుడ్ కి వెళ్లి ప్ర‌యోగం చేసారు. కానీ అక్క‌డా అత‌డికి వైఫ‌ల్యం ఎదురైంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. దీంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు నిరుత్సాహ‌ప‌డిన‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ వారం విడుదలైన ప్రముఖ గాయకుడు గురు రంధవా తొలి చిత్రం 'కుచ్ ఖట్టా హో జాయ్' ఆశించిన ఫ‌లితం ద‌క్కించుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. నిజానికి గురూకి ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని చాలా ఆశించారు. యూట్యూబ్‌లో గురు రంధవా సింగిల్స్ కేవలం కొన్ని రోజుల్లోనే కోట్లాదిగా వీక్షణలను పొందాయి. గురుకు థియేటర్లలో కూడా అదే తరహా ఆదరణ లభిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ బాక్సాఫీస్ మాత్రం పూర్తిగా భిన్నమైన అంశాల‌కు సంబంధించిన‌ద‌ని మరోసాని నిరూప‌ణ అయింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా తిర‌స్క‌రించారు.

గురు రంధవా న‌టించిన చిత్రం మొద‌టి రోజు క‌నీసం 25 ల‌క్ష‌లు కూడా థియేట‌ర్ల నుంచి తేలేక‌పోయింది. ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ మూవీ భాగమతి (2018)ని అందించిన అశోక్ జి దర్శకత్వం వహించారు. ఉత్త‌రాదిన మంచి హిట్టు కొట్టి కెరీర్ ని ట్రాక్ లో పెట్టాల‌ని భావించినా అది ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.