Begin typing your search above and press return to search.

ధ‌నుష్ 'కుబేర' ర‌న్ మూడు గంట‌లు కాదా?

ఇదిలా ఉంటే సెన్సిటీవ్ సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరున్న శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం ధ‌నుష్ హీరోగా కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో 'కుబేర‌'ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2025 5:10 AM
ధ‌నుష్ కుబేర ర‌న్ మూడు గంట‌లు కాదా?
X

ప్ర‌తి డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌కు ర‌న్ టైమ్ టెన్ష‌న్ ఉండేది కానీ 'అర్జున్ రెడ్డి' త‌రువాత ఆ టెన్ష‌న్ ఎవ‌రిలోనూ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ర‌న్ టైమ్ పెద్ద ఇష్యూ కాద‌ని అర్జున్‌రెడ్డి నిరూపించ‌డంతో చాలా వ‌ర‌కు స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు ర‌న్ టైమ్ 3 గంట‌లు అయినా స‌రే వెనుకాడ‌టం లేదు. ఈ మ‌ధ్య విడుద‌లైన యానిమ‌ల్‌, పుష్ప 2 ర‌న్ టైమ్ కూడా మూడు గంట‌ల‌పైనే ఉండ‌టం, అవి ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రించ‌డంతో ఇప్పుడు అంతా త‌మ సినిమాల ర‌న్ టైమ్ మూడు గంట‌ల‌పైనే ఉండేలా చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సెన్సిటీవ్ సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరున్న శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం ధ‌నుష్ హీరోగా కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో 'కుబేర‌'ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ జూన్ 20 అంటే మ‌రో ప‌దిరోజుల్లో పాన్ ఇండియా మూవీగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ధ‌నుష్ బిచ్చ‌గాడిగా, నాగార్జున కోటీశ్వ‌రుడిగా న‌టించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ర‌న్ టైమ్‌పై ర‌క ర‌కాల వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

శేఖ‌ర్ క‌మ్ముల రెగ్యుల‌ర్‌గా త‌న సినిమాల కోసం ఎక్కువ ఫుటేజ్‌ని వాడుతాడ‌ని, దాన్ని ఎడిట‌ర్ టేబుల్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి కావాల్సిన వ‌ర‌కు ట్రిమ్ చేస్తార‌నే టాక్ ఉంది. అయితే ఇటీవ‌ల ర‌న్ టైమ్ విష‌యంలో ఎవ‌రూ రాజీప‌డ‌టం లేదు కాబ‌ట్టి 'కుబేర‌' ర‌న్ టైమ్ కూడా మూడు గంట‌ల‌కు పైనే ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా శేఖ‌ర్ క‌మ్ముల ప్లాన్ చేసుకుని ఈ మూవీ ర‌న్ టైమ్‌ని మూడు గంట‌ల‌లోపే కుదించ‌డం విశేషం. ఒక ద‌శ‌లో ఈ సినిమా ర‌న్ టైమ్ మూడు గంట‌ల న‌ల‌భై ఐదు నిమిషాలు ఉంటుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఈ ప్ర‌చారాల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ టీమ్ 'కుబేర‌' ర‌న్ టైమ్‌ని 2 గంట‌ల 50 నిమిషాల‌కు ఫిక్స్ చేశారు. నాగార్జున కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసిన ఈ మూవీకి ప్ర‌మోష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం సినీ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆశించిన స్థాయిలో ప‌బ్లిసిటీ లేక‌పోవ‌డం, ఇప్ప‌టికీ దేవిశ్రీ‌ప్రసాద్ రెండు పాట‌ల‌ని ఇంకా పెండింగ్ పెట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.