Begin typing your search above and press return to search.

న‌టి త‌ల్లి `అర్గా*మ్‌` పొంద‌కుండా ఆపేసింది

క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన `ల‌స్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ యువ‌త‌రంలో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ సినిమాలో ఘాటైన రొమాన్స్, మాస్ట‌ర్‌బేష‌న్ స‌న్నివేశాల‌కు స్పంద‌న అనూహ్యం.

By:  Tupaki Desk   |   3 May 2025 5:30 PM
న‌టి త‌ల్లి `అర్గా*మ్‌` పొంద‌కుండా ఆపేసింది
X

క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన `ల‌స్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ యువ‌త‌రంలో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ సినిమాలో ఘాటైన రొమాన్స్, మాస్ట‌ర్‌బేష‌న్ స‌న్నివేశాల‌కు స్పంద‌న అనూహ్యం. స్త్రీ లైంగిక అవ‌స‌రాలు, స్వేచ్ఛ గురించి మునుపెన్న‌డూ రాని కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని తెర‌కెక్కించారు. ఒక ఎపిసోడ్ లో కియ‌రా అద్వాణీ న‌ట‌న‌కు యూత్ ఫిదా అయిపోయారు. శృంగార ఉద్ధీప‌న‌ల‌ను రెచ్చ‌గొట్టే, మాస్ట‌ర్ బేష‌న్- ఆర్గాజ‌మ్ స‌న్నివేశంలో కియ‌రా జీవించింది. ఫ్లెక్సిబుల్ పెర్ఫామెన్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అయితే ఈ పాత్ర‌లో న‌టించాల్సిందిగా ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తొలుత కృతి స‌నోన్ ని సంప్ర‌దించారు. కానీ ఇందులో అర్గాజమ్ ఫీలింగ్ ని చూపించే క్లైమాక్స్ స‌న్నివేశానికి కృతిస‌నోన్ త‌ల్లి అడ్డు చెప్పార‌ని క‌రణ్ గ‌త ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. కృతి మొద‌టి ఆప్ష‌న్.. కానీ ఆ త‌ర్వాత ఆప్ష‌న్ కియ‌రా అద్వాణీకి వెళ్లింది. లైంగిక‌త‌తో ముడిప‌డిన స‌న్నివేశాల్లో త‌న కుమార్తె న‌టించ‌డం ఇష్టం లేద‌ని కృతి త‌ల్లిగారు క‌ర‌ణ్ కి చెప్పార‌ట‌. కానీ ల‌స్ట్ స్టోరీస్ విడుద‌ల‌య్యాక‌, ఆ స‌న్నివేశంలో న‌టించిన న‌టికి మంచి పేరొచ్చింది. కియ‌రా జాక్ పాట్ కొట్టేసింది.

అయితే `కాఫీ విత్ కరణ్` గ‌త‌ ఎపిసోడ్‌లో కృతిని ఆట‌ప‌ట్టించే అవ‌కాశాన్ని క‌ర‌ణ్ వ‌దులుకోలేదు. కృతిని తన తల్లి అర్గాజ‌మ్ పొందకుండా ఆపిందని ఆటపట్టించాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన క్లిప్ రెగ్యుల‌ర్‌గా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది. అది ఇప్పుడు రెడ్డిట్‌లో తిరిగి షేర్ అవుతోంది. అయితే క‌ర‌ణ్ కృతికి త‌న త‌ల్లి వ‌ల్ల అవ‌కాశం కోల్పోయిన విష‌యాన్ని గుర్తు చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఓ మై గాడ్ ఆ వాక్యం (అర్గాజ‌మ్ రాకుండా ఆపింది) చాలా భయంకరంగా ఉంది! అని కృతి అత‌డితో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో స‌ర‌దాగా వ్యాఖ్యానించింది.

కృతి త‌ల్లి అంగీక‌రించ‌లేదు కాబ‌ట్టి ఇత‌ర న‌టీమ‌ణుల‌ త‌ల్లులు కూడా ఒప్పుకోర‌ని తాను టెన్ష‌న్ ప‌డ్డాన‌ని క‌ర‌ణ్ అన్నారు. కానీ చివ‌రికి కియ‌రా అద్వాణీ దీనికి అంగీక‌రించింది. కియ‌రాను మ‌నీష్ మ‌ల్హోత్రా ఇంట్లో క‌లిసాను. త‌న పేరు ఆలియా అద్వానీ అని తెలుసు. నా ఫోన్‌లో అలాగే సేవ్ చేసుకున్నాను. నేను ల‌ఘుచిత్రం తెర‌కెక్కిస్తున్నాన‌ని తెలుసుకుని నాతో క‌లిసి ప‌ని చేసేందుకు అంగీక‌రించింద‌ని క‌ర‌ణ్ అన్నారు. స్త్రీల కోణంలో ఇది చాలా శ‌క్తివంత‌మైన క‌థ‌.. ఇది స్త్రీ ఆనందించే హక్కు గురించి అని కియ‌రాకు వివ‌రించాన‌ని క‌ర‌ణ్ తెలిపారు.