Begin typing your search above and press return to search.

వీరమల్లు గ్యాప్.. క్రిష్ తో మరో మెగా హీరో

సాయి ధరమ్ తేజ్ తో వీలైనంత తక్కువ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారంట.

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:31 AM GMT
వీరమల్లు గ్యాప్.. క్రిష్ తో మరో మెగా హీరో
X

ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. కరోనా కొంతకాలం ఈ చిత్ర షూటింగ్ కి ఆటకం సృష్టించింది. అయితే మూవీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం కష్టపడుతున్నారు. దీంతో హరిహర వీరమల్లు మూవీకి కొద్ది రోజులు పక్కన పెట్టారు.

కంప్లీట్ పీరియాడికల్ జోనర్ మూవీ కావడం, క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉండటంతో పూర్తిగా డెడికేట్ చేయడం కష్టం అని భావించి రెగ్యులర్ కంటెంట్ తో చేస్తోన్న ఓజీ, ఉస్తాద్ ఫినిష్ చేయడంపై దృష్టి పెట్టారు. ఈ సినిమాల కోసం లుక్ పరంగా కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే క్రిష్ కి గ్యాప్ రావడంతో ఈ టైంలో మినిమమ్ రేంజ్ హీరోతో ఒక సినిమా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.

హరిహర వీరమల్లు ఎనౌన్స్ చేసిన తర్వాత కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే మూవీ చేశారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ బాగున్నా కరోనా సమయంలో ఎక్కువమందికి రీచ్ కాలేదు. థియేటర్స్ లో ప్రదర్శించడం కూడా దానికి మైనస్ అయ్యింది. అయితే మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఆ మూవీ ఓటీటీలో చాలా మందికి కనెక్ట్ అయ్యింది.

అయితే హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఎలక్షన్స్ అయ్యేంత వరకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో ఇప్పటికే తాను సిద్ధం చేసుకున్న కథతో మరో మెగా హీరోతో మూవీ చేయాలని అనుకుంటున్నారంట. సాయి ధరమ్ తేజ్ తో వీలైనంత తక్కువ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారంట. తేజ్ కూడా బ్రో మూవీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే క్రిష్ మాత్రం తేజ్ కి స్టోరీ చెప్పి వీలైనంత వేగంగా మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారంట.

త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మామయ్యతో మూవీ చేస్తోన్న దర్శకుడు కావడంతో క్రిష్ కి తేజ్ కూడా ఒకే చెప్పే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది బయటకెళ్లొచ్చే వరకు తెలియదు.