Begin typing your search above and press return to search.

కోలీవుడ్ కన్ను కూడా బన్నీ పైనే..

కోలీవుడ్ స్టార్ దర్శకులు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:14 AM GMT
కోలీవుడ్ కన్ను కూడా బన్నీ పైనే..
X

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ వేల్యూ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 సినిమాతో దానిని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో బన్నీ ఉన్నారు. పాన్ ఇండియా బ్రాండ్ వస్తే మార్కెట్ కూడా పెరుగుతుంది. ఇండియన్ వైడ్ గా వచ్చే ఆదరణతో నిర్మాతలకి కూడా భారీ లాభాలు వస్తాయి. ఇక దర్శకులకి కూడా బన్నీతో సినిమా చేస్తే పాన్ ఇండియా రేంజ్ తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది.

అందుకే ఆ అవకాశం ఎవరు వచ్చిన వదులుకోరు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి-సిరీస్ లో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఎవరితో చేస్తాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. కోలీవుడ్ స్టార్ దర్శకులు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు.

ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ అల్లు అర్జున్ కి ఓ కథ నేరేట్ చేసారంట, అలాగే జవాన్ తో సూపర్ సక్సెస్ అందుకున్న అట్లీ కూడా ఐకాన్ స్టార్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విక్రమ్ వేద సినిమాతో సక్సెస్ అందుకున్న పుష్కర్ గాయత్రి ద్వయం కూడా అల్లు అర్జున్ కి ఒక యాక్షన్ ప్యాక్డ్ కథని చెప్పారంట. అలాగే ఎన్ లింగుస్వామి కూడా ఎప్పటి నుంచో బన్నీతో మూవీ చేయాలని ట్రై చేస్తున్నారు.

అయితే ది వారియర్ మూవీని రామ్ పోతినేని హీరోగా తెలుగులో చేసిన లింగుస్వామి డిజాస్టర్ కొట్టారు. దీంతో అల్లు అర్జున్ లింగు స్వామిపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు ఈ లైన్ లోకి జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న నెల్సన్ దిలీప్ వచ్చి చేరాడు. రీసెంట్ గా బన్నీని కలిసి కథ కూడా చెప్పారంట.

అయితే కథ నచ్చిన వరుసగా ఇద్దరు దర్శకులతో మూవీస్ కమిట్ అయ్యి ఉండటంతో ఈ లోపు ఒక సినిమా చేసుకోమని నెల్సన్ దిలీప్ కి అల్లు అర్జున్ చెప్పారంట. సందీప్ రెడ్డి వంగా మూవీ కంప్లీట్ అయిన తర్వాత నెల్సన్ దిలీప్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.