Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ నటికి కూడా యానిమల్ నచ్చలేదా?

ఇటీవల జరిగిన వాట్ ఇండియా థింక్స్ టుడే రెండో ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న నటి ఖుష్బూ.. యానిమల్ మూవీపై స్పందించారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:41 AM GMT
ఆ సీనియర్ నటికి కూడా యానిమల్ నచ్చలేదా?
X

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రూ.900 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఎంత మంది ఇష్టపడ్డారో.. అంత మంది విమర్శించారు!

యానిమల్ మూవీలోని పలు అంశాలు అస్సలు బాలేవని, సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే బహిరంగంగా చెప్పారు. మరికొందరు పరోక్షంగా మండిపడ్డారు. సీనియర్ నటి రాధిక, కస్తూరి శంకర్ కొన్నిరోజుల క్రితం.. యానిమల్ మూవీపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్ చేరారు.

ఇటీవల జరిగిన వాట్ ఇండియా థింక్స్ టుడే రెండో ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న నటి ఖుష్బూ.. యానిమల్ మూవీపై స్పందించారు. అసలు యానిమల్ సినిమా విజయం కావడమే తనకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉందని చెప్పారు. ప్రజల ఆలోచనల గురించి మనం ఏం చెప్పగలమని అన్నారు. యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారన్నంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూవీ లవర్స్ మనస్తత్వమే ఇప్పుడు ఓ పెద్ద సమస్య అని ఖుష్బూ అన్నారు. ఎందుకంటే సినిమాల్లో చూపించనవే ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మద్దతు పలుకుతుండగా, మరికొందరు తప్పుపడుతున్నారు. ప్రస్తుతం యానిమల్ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

హీరోయిన్ గా నటి ఖుష్బూ సుందర్.. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1990లో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. గోపీచంద్ రామబాణం మూవీలో నటించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.