మూడు దశాబ్ధాల ఖల్ నాయిక్ కు సీక్వెల్!
మూడు దశాబ్దాలు గడుస్తున్నా? `ఖల్ నాయక్` పేరు వినిపించందంటే నాటి అభిమానులకు ఓ వైబ్రేషన్ జనిస్తుంది.
By: Tupaki Desk | 26 May 2025 7:23 AMసంజయ్ దత్, జాకీ ష్రాఫ్ , మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సుభాష ఘాయ్ తెరకెక్కించిన `ఖల్ నాయక్` అప్పట్లో ట్రెండ్ సెట్టర్ చిత్రం. బాలీవుడ్ హిట్ చిత్రాల్లో ముందు వరుసలో ఉండేది? ఏ సినిమా అంటే అంతా ఖల్ నాయక్ పేరు చెబుతారు. అప్పట్లో అంత గొప్ప విజయం సాధించడంతోనే బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగింది. ఇందులో ఐకానిక్ పాటలు, మాధురీ దిక్షిత్ స్టెప్పులు, సంజయ్, జాకీ నటన ఎప్పటికీ మర్చిపోలేనిది.
మూడు దశాబ్దాలు గడుస్తున్నా? `ఖల్ నాయక్` పేరు వినిపించందంటే నాటి అభిమానులకు ఓ వైబ్రేషన్ జనిస్తుంది. `ఖల్ నాయక్` పాత్రల గురించి మొదలు పెడతారు అభిమానులు. అలా బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఖల్ నాయక్. తాగాగా మూడు దశాబ్దాల తర్వాత ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది. సుభాష్ ఘాయ్ ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
హిట్ జోడీ సంజయ్ దత్, మాధురి దీక్షిత్ లను ప్రత్యేక పాత్రలకు ఎంపిక చేసినా నేటి జనరేష్ హీరో, హీరోయిన్ తో సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం సుభాష్ అతడి బృందం తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. సీక్వెల్ ఆలోచన మంచిదే. అంచనాలు భారీగానే ఉంటాయి. బిజినెస్ పరంగా తిరుగుండదు. అయితే ఇలాంటి క్లాసిక్ చిత్రాల సీక్వెల్స్ అన్నది సరిగ్గా కలిసి రావడం లేదు.
ఆ నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతున్నాయి. ప్రతిగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. `జంజీర్` రీమేక్ విషయంలో అపూర్వ లాఖియా ఇలాంటి విమర్శలే ఎదుర్కున్నాడు. ఇంకా ఇలాంటి సీక్వెల్ చేసి చేతులు కాల్చుకున్న దర్శకులు మరికొంత మంది ఉన్నారు. మరి సుభాష్ ఘాయ్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ కంటెంట్ తో వస్తే పర్వాలేదు.