కత్రినా కూడా వెయిట్ చేస్తుందట..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పుడు అంతగా ఫాం లో లేదు కానీ ఒకప్పుడు అమ్మడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 3:30 AMబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పుడు అంతగా ఫాం లో లేదు కానీ ఒకప్పుడు అమ్మడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. బీ టౌన్ ఆడియన్స్ డ్రీం గర్ల్ గా కత్రినా అదరగొట్టేసింది. 2003 భూమ్ సినిమాతో బాలీవుడ్ కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తుంది. ఐతే ఆఫ్టర్ మ్యారేజ్ కాస్త దూకుడు తగ్గినా కత్రినా పాపులారిటీ మాత్రం అలానే ఉంది. అంతకుముందు ఏడాదికి 2, 3 సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్ ఇప్పుడు ఒకటి మాత్రమే చేస్తుంది.
లాస్ట్ ఇయర్ మెర్రీ క్రిస్ మస్ తో అలరించిన కత్రినా కైఫ్ నెక్స్ట్ హౌజ్ ఫుల్ 5 తో రాబోతుంది. పెళ్లైనా ఆమె గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. ఐతే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మడు సెలెక్టెడ్ సినిమాలే చేస్తుంది. ఐతే ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కూడా పాన్ ఇండియా మోజులో పడ్డారు. అందుకే తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల వైపు చూస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ భామలు అలియా భట్, దీపిక పదుకొనె, దిశా పటాని, కియరా అద్వాని, జాన్వి కపూర్ ఇలా అందరు కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ సినిమా ఛాన్స్ వస్తే మాత్రం అసలు వదులుకోవట్లేదు. ఐతే వీళ్లందరి కన్నా ముందే కత్రినా కైఫ్ తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉంది. భూమ్ తర్వాత అమ్మడు రెండో సినిమానే తెలుగులో వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి సినిమా చేసింది. బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమా కూడా చేసింది.
తెలుగులో రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇటు వైపు చూడని కత్రినా ఇన్నాళ్లకు మళ్లీ టాలీవుడ్ మీద ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. కత్రినా ఓకే అనాలే కానీ మన మేకర్స్ ఆమెను ఒప్పించి స్టార్ సినిమాలో చేయించేస్తారు. ఐతే ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా మంచి బజ్ ఉన్న సినిమా.. పాన్ ఇండియా మొత్తం ఊపేసే సినిమా చేయాలని కత్రినా భావిస్తుంది. అలాంటి అవకాశం వస్తే మాత్రం వెంటనే యెస్ చెప్పేయాలని చూస్తుందట. మరి ఇన్నేళ్ల తర్వాత కంత్రినాని మళ్లీ తెలుగు తెర మీదకు తెచ్చే ప్రయత్నం ఎవరు చేస్తారన్నది చూడాలి. కత్రినా టాలీవుడ్ ఎంట్రీ కోసం అమ్మడి ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.