Begin typing your search above and press return to search.

రజిని కోసం కరుణానిధి సాక్రిఫైజ్..!

దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి డైలాగ్స్ రాస్తే ఆ సినిమాలో తాను నటించలేనని రజిని వెల్లడించారు. ఇంతకీ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియాలంటే 1980 లోకి వెళ్లాలి.

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:30 PM GMT
రజిని కోసం కరుణానిధి సాక్రిఫైజ్..!
X

సూపర్ స్టార్ రజినికాంత్ కరుణానిధి శత జయంతి ని పురష్కరించుకుని మురసోలి దిన పత్రికలో రాసిన వ్యాసం వైరల్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి డైలాగ్స్ రాస్తే ఆ సినిమాలో తాను నటించలేనని రజిని వెల్లడించారు. ఇంతకీ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియాలంటే 1980 లోకి వెళ్లాలి. 1980లో ఒక సినిమాలో నటించడానికి తను ఓకే చెప్పగా ఆ సినిమాకు డైలాగ్స్ రాసేందుకు కరుణానిధి ఒప్పుకున్నారని నిర్మాత చెప్పారు. కరుణానిధి డైలాగ్స్ అనగానే తనకు కంగారు పుట్టిందని అన్నారు రజినికాంత్.

ఆ టైం లో తమిళం మాట్లాడటానికి కష్టపడుతున్న తానూ ఏకంగా కరుణానిధి సంభాషణలు మాట్లాడుతూ నటించడం కాని పని అనుకున్నారట. అందుకు బదులుగా కర్ణాటక వెళ్లి బస్సుల్లో టికెట్లు కొట్టుకుంటానని అనిపించిందట. అవకాశం కల్పిస్తే ఆయన్ను కలిసి ఆ విషయం చెబుతా కరుణానిధి సంభాషణలు రాస్తే నటించనని చెప్పారట. నిర్మాత అయిష్టంగానే గోపాలపురంలో కరుణానిధి కలిసే ఏర్పాటు చేయగా సాధారణ తమిళం మాట్లాడానికె ఇబ్బంది పడుతున్నా.. మీ సంభాషణలు ఎలా మాట్లాడగలను అని అన్నారట. అది అసాధ్యం తప్పుగా భావించవద్దని రిక్వెస్ట్ చేశారట.

ఆయన నవ్వుతూ ఎవరికెలా డైలాగ్స్ రాయాలో తెలుసని కరుణానిధి రజినితో చెప్పారట. ఎం.జి.ఆర్ కు రాసినట్తు శివాజి గణేషన్ కు రాయనని.. శివాజి గణేషన్ కి రాసినట్టు ఎం.జి.ఆర్ కు రాయనని చెప్పగా.. అప్పటికీ తను మౌనంగా ఉండటాన్ని అర్థం చేసుకుని తప్పుగా అనుకోను ఇంతకుముందు సినిమాకు ఎవరు రాశారో వారినే రాయనీ అని చెప్పారట కరుణానిధి.

నిర్మాతని పిలిచి షూటింగ్ ఈ నెల 10 నే అంటున్నారు.. నేను నెక్స్ట్ మంత్ అనుకుని డైలాగ్స్ రాయడానికి ఒప్పుకున్నా.. నాకు సాధ్యపడదు.. తర్వాత సినిమాకు చూద్దామని అన్నారట. ఆ తర్వాత తనని చూసి సంతోషంగా అని అడిగారు.. నిర్మాతని ఇబ్బంది పెట్టకుండా తన కోరిక మన్నించారంటూ కరుణానిధి స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నారు రజినికాంత్. రజిని సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా జైలర్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ టీ.జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా లో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది.