Begin typing your search above and press return to search.

#SSMB29 : హైప్ పెంచిన కార్తికేయ ట్వీట్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా మహేష్ బాబు తో అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 11:30 AM GMT
#SSMB29 : హైప్ పెంచిన కార్తికేయ ట్వీట్‌
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా మహేష్ బాబు తో అనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఈ సినిమాను రాజమౌళి రూపొందించబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జపాన్‌ లోని ఒక థియేటర్‌ లో 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లాడు. కార్తికేయ కూడా వారితో ఉన్నాడు. ట్విట్టర్ లో కార్తికేయ జపాన్ లో వచ్చిన భూకంపం గురించి ట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌ కి మహేష్ బాబు అభిమాని స్పందిస్తూ... #SSMB29 సినిమా ట్రైలర్‌ ఇంపాక్ట్‌ కి రిహార్సల్‌ చేస్తున్నారా అంటూ కామెంట్‌ ట్వీట్‌ చేశాడు. అందుకే కార్తికేయ స్పందిస్తూ.. ఆ ఇంపాక్ట్‌ కేవలం జపాన్ లో మాత్రమే ఉండదు కదా అన్నట్లుగా రీ ట్వీట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది.

నిజమే మహేష్ బాబు, రాజమౌళి సినిమా ట్రైలర్‌ ఇంపాక్ట్‌ కేవలం జపాన్‌ లేదా ఇండియాలో మాత్రమే ఉండదు. ఆ ఇంపాక్ట్‌ మొత్తం ప్రపంచం మొత్తం ఉంటుందని ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్‌ కోసం ప్రతి ఒక్కరం ఎదురు చూస్తున్నామని వారు అన్నారు.

ఈ ఏడాదిలోనే సినిమా అధికారిక ప్రకటన మహేష్‌ బాబు, రాజమౌళి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2026 లో సినిమా విడుదల ఉండే అవకాశం ఉందని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా మాత్రమే ప్రకటించాడు.