Begin typing your search above and press return to search.

భూకంపం నుంచి నా ఫ్యామిలీ సేఫ్!

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఫ్యామిలీ జ‌పాన్ లో ని భూకంపం నుంచి సేఫ్ గా ఉన్న‌ట్లు తాజాగా కార్తికేయ ట్వీట్ చేసాడు.

By:  Tupaki Desk   |   21 March 2024 9:10 AM GMT
భూకంపం నుంచి నా ఫ్యామిలీ సేఫ్!
X

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఫ్యామిలీ జ‌పాన్ లో ని భూకంపం నుంచి సేఫ్ గా ఉన్న‌ట్లు తాజాగా కార్తికేయ ట్వీట్ చేసాడు. `ఇప్పుడే జాపాన్ లో భ‌యంక‌ర‌మైన భూంకంపం వ‌చ్చింది. మేమంతా 28వ అంత‌స్తుల్లో ఉన్న‌ప్ప‌డు భూమి నెమ్మ‌దిగా క‌ద‌ల‌డం గ‌మ‌నించాం. ఇది భూకంప అని గ్ర‌హించ‌డానికి మాకు కొంత స‌మ‌యం ప‌ట్టింది. మేమంతా భ‌య‌ప‌డుతుంటే? జపాన్ వాళ్లు మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఏదో వర్షం పడుతున్నట్లుగా ఎవ‌రి ప‌ని వారు చూసుకుంటున్నారు.

భూకంపాన్ని ఫీల‌య్యే అయ్యే కోరిక తీరింది` అని ట్వీట్ చేసాడు. అంతే కాదండోయ్ భూకంపం రాబోతు న్న‌ట్లు అలెర్ట్ మెసేజ్ కూడా వ‌చ్చింద‌ని దాన్ని కూడా షేర్ చేసాడు. అయితే ఈ అలెర్ట్ తో రాజ‌మౌళి అభిమానులు మాత్రం కంగారు..ఆందోళ‌న‌కి గుర‌య్యారు. కానీ ఆ కాసేప‌టికి విష‌యం పూర్తిగా తెల‌సుకుని కూల్ అయ్యారు. జపాన్ లో భూకంపాల‌....సునామీల హెచ్చ‌రిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. అయితే రిక్ట‌ర్ట్ స్కేల్..సిస్మోగ్రాఫ్ లెక్క‌ల్ని బ‌ట్టి అక్క‌డి ప్ర‌భుత్వం అలెర్ట్ అవుతుంది.

సాధార‌ణ అలెర్ట్ ని అక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు. ఇలాంటి హెచ్చ‌రిక‌లు బాగా అల‌వాటైన జీవులు కాబ‌ట్టి వాటిని లైట్ తీసుకుంటారు. రాజ‌మౌళి ఫ్యామిలీకి ఇలాంటివి కొత్త కాబ‌ట్టి భ‌య‌ప‌డ్డారు. ఇంత‌కీ ఇప్పుడు రాజమౌళి ఫ్యామిలీ జ‌పాన్ కి ఎందుకు వెళ్లిన‌ట్లు? అంటే ఇటీవ‌ల జ‌రిగిన ఆస్కార్ వేడుకలు సంద‌ర్భంగా గత ఏడాది ఆస్కార్‌ వేదికపై `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం సృష్టించిన సందర్భాన్ని అందరూ మరోసారి గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ విజయాన్ని అక్కడి ప్రేక్షకులతో కలసి ఆస్వాదించడానికి రాజమౌళి ఫ్యామిలీ జపాన్ వెళ్లారు. కానీ ప్ర‌కృతి వాళ్ల‌కు భూకంపం అనుభూతిని పంచింది. నిన్న‌టి రోజును..ఆ స‌న్నివేశాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప‌ అనుభ‌వం చూసారు.