Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ నో చెప్పేస‌రికి తార‌క్ తెర‌పైకి!

`బాహుబ‌లి` త‌ర్వాత పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్‌జోహ‌ర్ ఎంత‌గా ప్ర‌య‌త్నించారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 9:30 AM GMT
ప్ర‌భాస్ నో చెప్పేస‌రికి తార‌క్ తెర‌పైకి!
X

`బాహుబ‌లి` త‌ర్వాత పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్‌జోహ‌ర్ ఎంత‌గా ప్ర‌య‌త్నించారో తెలిసిందే. కుదిరితే నేరుగా బాలీవుడ్ లో తానే పరిచ‌యం చేయాల‌ని ఎంతో ఎఫెర్ట్ పెట్టి ప్ర‌యత్నించారు. అలా కుద‌ర‌ని ప‌క్షంలో తెలుగు...హిందీలోనైనా స్వ‌యంగా ఓ సినిమా నిర్మించాల‌ని చూసారు. కానీ ప్ర‌భాస్ బిజీ షెడ్యూల్ తో అది సాధ్య‌ప‌డ‌లేదు. అయినా స‌రే ప్ర‌భాస్ ని వ‌ద‌ల్లేదు చివ‌రి ప్ర‌య‌త్నంగా మూడ‌వ సారి కూడా డార్లింగ్ డేట్లు కోసం ట్రై చేసాడు. అయినా సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో డార్లింగ్ పై క‌ర‌ణ్ కాస్త అలిగిన‌ట్లు కూడా మీడియాలో ప్ర‌చారం సాగింది.

కానీ అలాంటిదేం లేద‌ని ఆ త‌ర్వాత ప్ర‌భాస్ మాట‌ల్ని బ‌ట్టి ఓ క్లారిటీ వ‌చ్చింది. తాజాగా క‌ర‌ణ్ దృష్టి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మీద ప‌డ్డ‌ట్లు స‌మాచారం. `వార్ -2` తో తార‌క్ బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ ఎలాంటి రోల్ పోషిస్తున్నాడు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ లేదు. కానీ తార‌క్ ని ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే క‌ర‌ణ్ లాక్ చేసే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తోన్న పాన్ ఇండియ‌మా చిత్రం `దేవ‌ర` నార్త్ బెల్ట్ లో క‌ర‌ణ్ జోహార్ నిర్మాణ సంస్థ అనిత్ తందానీతో క‌లిసి రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పుడా అవ‌కాశాన్ని క‌ర‌ణ్ తెలివిగా వాడుకునే ప్ర‌యత్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. దేవ‌ర రిలీజ్ అనంత‌రం త‌న సంస్థ‌లో తార‌క్ ఓసినిమా చేసే దిశ‌గా చర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తాజాగా లీకైంది. ఈ సినిమా తెలుగు నిర్మాణంలో తార‌క్ సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్ కూడా భాగ‌స్వామిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం క‌ళ్యాణ్ రామ్ అని భోగ‌ట్టా. క‌ళ్యాణ్ రామ్ ముందుండి నార్త్ లో కీల‌క పాత్ర పోషించారుట‌.

క‌ర‌ణ్ తో డీల్ సెట్ అవ్వ‌డానికి కార‌ణం కూడా క‌ళ్యాణ్ రామ్ అని వినిపిస్తోంది. అప్ప‌టి నుంచి క‌ర‌ణ్ -క‌ళ్యాణ్ రామ్ తో రెగ్యుల‌ర్ గా ట‌చ్ లోనూ ఉంటూ తార‌క్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారుట‌. తార‌క్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమాల విష‌యం కూడా ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ కి వ‌చ్చింద‌ని విశ్వ‌సనీయ స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే క‌ర‌ణ్ బ్యాన‌ర్లో తార‌క్ సినిమా తీస్తే బాగుంటుంది అన్న అభిప్రాయ‌న్ని క‌ర‌ణ్‌-క‌ళ్యాణ్ రామ్ తో పంచుకున్న‌ట్లు లీకులందుతున్నాయి. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.