Begin typing your search above and press return to search.

గొడ్డు మాంసం ఎపిసోడ్ మ‌ర్చిపోయావా పీసీ?

ఆ ఎపిసోడ్ లో పరిహాసానికి పీసీ కోలాహలంగా నవ్వింది. అయితే కాల‌క్ర‌మంలో క‌ర‌ణ్ తో పీసీ గొడ‌వ‌లు స‌ద్ధుమ‌ణిగిన‌ట్టే క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 5:47 PM GMT
గొడ్డు మాంసం ఎపిసోడ్ మ‌ర్చిపోయావా పీసీ?
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఒక సాధార‌ణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక హోదా అందుకుంది. ఇటీవ‌ల‌ హాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను హాలీవుడ్ కి వెళ్ల‌డానికి కార‌ణం బాలీవుడ్ రాజ‌కీయాల‌తో విసిగిపోవ‌డ‌మేన‌ని ఇంత‌కుముందు వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో హాలీవుడ్ నటుడు డాక్స్ షెపర్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లాల‌నే తన నిర్ణయం వెన‌క కార‌ణాల గురించి మాట్లాడింది. ప్రియాంక బాలీవుడ్‌లో ప‌ని చేసే క్ర‌మంలో కొంద‌రితో క‌లిసి గొడ్డు మాంసం తినాల్సి వ‌చ్చింద‌ని, పార్టీల‌కు వెళ్లాల్సి వ‌చ్చేద‌ని వ్యాఖ్యానించింది. దీనికి క్వీన్ కంగనా రనౌత్‌ సహా చాలా మంది నెటిజన్లు కరణ్ జోహార్ పైనే గురించి పీసీ కౌంట‌ర్లు వేసింద‌ని భావించారు.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో క‌ర‌ణ్ జోహార్ కి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. ప్రియాంక చోప్రా గ‌త కామెంట్ కి లింక‌ప్ చేస్తూ.. ఆమె హాలీవుడ్‌కు వెళ్లడం గురించి మీరు ఏమ‌ని భావిస్తున్నారు? అంటూ ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్ర‌శ్నించారు. దానికి కరణ్ జ‌వాబు ఇలా ఉంది. ''ఆమె (ప్రియాంక చోప్రా) బలం నుండి శక్తికి ఎదగడం .. నిజంగా ఆత్మ విశ్వాసంతో విజయాన్ని సాధించడం ప్ర‌త్యేక‌మైన‌ విష‌యాలు. స్వీయ‌ నిబంధనల‌తో ఆమె అనుకున్న మార్గంలోకి వెళ్ళిన విధానం.. ఎప్పుడూ తాను ఉన్న ప్రతి వేదిక‌పైనా అద్భుతంగా ఎదిగింది. ఆమె ప్రాతినిధ్యం వహించే ప్రతిదీ అద్భుతమైనది'' అని ప్ర‌శంసించారు.

మార్చి 2023లో డాక్స్ షెపర్డ్ పోడ్‌కాస్ట్ ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్ షోకు ప్రియాంక అతిథిగా వచ్చారు. పీసీ ఈ షోలో తాను బాలీవుడ్‌ను ఎందుకు విడిచిపెట్టిందో వెల్ల‌డించింది. పీసీ మాట్లాడుతూ- ''నేను పరిశ్రమలో (బాలీవుడ్) కార్న‌ర్ అయ్యాను. నాకు అవ‌కాశాలు ఇవ్వ‌ని వ్యక్తులు ఉన్నారు. నేను వారితో గొడ్డు మాంసం తిన్నాను. నేను ఆ ఆట ఆడటం మంచిది కాదు.. పైగా రాజకీయాలతో విసిగిపోయాను.. నాకు విరామం అవసరమ‌ని భావించాను'' అని తెలిపింది.

సంభాషణల్లో ఎక్క‌డా కరణ్ జోహార్ పేరు ప్ర‌స్థావించ‌న‌ప్ప‌టికీ అంద‌రికీ అత‌డే గుర్తుకు వ‌చ్చాడు. అయితే కరణ్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' చివరి ఎపిసోడ్‌లో ప్రియాంక.. కరీనా కపూర్ ఖాన్‌తో క‌లిసి అతిథిగా వచ్చింది. ఆ ఎపిసోడ్ లో పరిహాసానికి పీసీ కోలాహలంగా నవ్వింది. అయితే కాల‌క్ర‌మంలో క‌ర‌ణ్ తో పీసీ గొడ‌వ‌లు స‌ద్ధుమ‌ణిగిన‌ట్టే క‌నిపిస్తోంది. 'గొడ్డు మాంసం' ఎపిసోడ్స్ మ‌రిచిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రియాంక నేరుగా కరణ్‌ను కలుసుకుని కౌగిలించుకుంది. వేదిక‌పై ఆ ఇద్ద‌రి క‌ల‌యిక అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.