Begin typing your search above and press return to search.

కరాచీ టు నొయిడా.. పబ్ జీ ప్రేమకథతో మూవీ..!

ఈ సినిమా జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో అమిత్ జానీ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో సీమా పాత్ర కోసం ఆడిషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:30 PM GMT
కరాచీ టు నొయిడా.. పబ్ జీ ప్రేమకథతో మూవీ..!
X

పబ్ జీ ఆడుతూ భారతీయుడి మీద ప్రేమతో పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే ఆమె తన పిల్లలతో సహా ఇండియాకు వచ్చేసింది. భర్తను విడిచి నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చిన ఆ పాకిస్థానీ మహిళ గురించి రీసెంట్ గా వార్తల్లో హెడ్ లైన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ న్యూస్ సూపర్ పాపులర్ అవడంతో ఇప్పుడు ఈ కథతో సినిమా రాబోతుంది. ఒక ఆన్ లైన్ ఆటతో పరిచయమై అది ప్రేమగా మారి ఆల్రెడీ పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ ఇండియాకు వచ్చిన కథతోనే ఓ సినిమా రాబోతుంది.

ఈ సినిమాకు కరాచీ టు నొయిడా అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ఆడిషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో అమిత్ జానీ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో సీమా పాత్ర కోసం ఆడిషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే సీమా హైదర్ ని పోలిన మిడిల్ ఏజ్ ఉమెన్ కోసం యూనిట్ సెర్చ్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం రియల్ సీమానే పెట్టాలను అనుకోగా ఆమె ఎందుకో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఇందులో యాక్ట్ చేస్తే ఆమెని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని తెలుస్తుంది.

సీమా హైదర్ సినిమా అటుంచితే అమె ఇండియాలోకి సరైన ఆధారాలు లేకుండా వచ్చిందని తెలిసిందే. అయితే ఆమెను తిరిగి పాక్ కి పంపిస్తే ఆమెను అక్కడ హత్య చేసే ప్రమాదం ఉందని తెలుస్తుంది. అందుకే ఈ విషయాన్ని మానవీయ కోణంలో ఆలోచించాలని ప్రభుత్వం చూస్తుంది. కరాచీ టు నొయిడా సినిమాలో నటించడానికి ఒప్పుకోని సీమ ఏ టైలర్ మర్డర్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె రా ఏజెంట్ గా కనిపించనుంది.

కరాచీ టు నొయిడా సినిమా కోసం మాత్రం ఆమెను పోలిన ఒక నటిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్ లోకి తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సీమా గురించి ఇన్నాళ్లు వార్తల్లోనే హైలెట్ కాగా సినిమాగా వస్తే ఆమె గురించి ఇంకాస్త ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది.