Begin typing your search above and press return to search.

మహేష్ మూవీ వదులుకున్నందుకు ఇప్పుడు ఏడుస్తుంది!

చంద్రముఖి 2 ప్రమోషన్స్ కోసం యూనిట్‌ సభ్యులతో కలిసి హైదరాబాద్ కి వచ్చిన కంగనా మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:30 PM GMT
మహేష్ మూవీ వదులుకున్నందుకు ఇప్పుడు ఏడుస్తుంది!
X

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్‌ కెరీర్ ఆరంభంలో ప్రభాస్ కి జోడీగా ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగు లో కంగనా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. పూరి దర్శకత్వం లోనే రూపొందిన పోకిరి సినిమాలో కూడా కంగనా కి ఛాన్స్ దక్కింది.

పోకిరి సినిమాలో మహేష్ బాబు పాత్రకు కంగనా బాగుంటుందని పూరి భావించాడు. కానీ కంగనా మాత్రం ఆ సమయంలో ఇతర కమిట్మెంట్స్ ఉన్న కారణంగా పూరికి నో చెప్పింది. తాజాగా చంద్రముఖి 2 సినిమాలో నటించిన కంగనా రనౌత్‌ అప్పటి విషయాలను గుర్తు చేసుకుని ఆ ఛాన్స్ ని మిస్ చేసుకున్నందుకు గాను చింతిస్తున్నట్లుగా పేర్కొంది.

చంద్రముఖి 2 ప్రమోషన్స్ కోసం యూనిట్‌ సభ్యులతో కలిసి హైదరాబాద్ కి వచ్చిన కంగనా మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. పోకిరి మరియు గ్యాంగ్‌స్టర్ సినిమా నిర్మాతలు నన్ను ఒకే సారి సంప్రదించారు. ఇద్దరికి కూడా డేట్లు ఒకే సారి కావాల్సి వచ్చింది.

2005 అక్టోబర్‌ లో నా తేదీలను రెండు సినిమాలకు ఇద్దరు నిర్మాతలు అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోకిరి సినిమా వదులుకుని గ్యాంగ్‌స్టర్ సినిమాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. అయితే పోకిరి సినిమా ను వదులుకున్నందుకు నేను ఇప్పటికి కూడా చింతిస్తూ ఉంటాను అన్నట్లుగా కంగనా చెప్పుకొచ్చింది.

ఏక్‌ నిరంజన్ సినిమా తో కంగనా కి అక్కడ ఇక్కడ గుర్తింపు వచ్చేలా పూరి చేశాడు. అలాంటి పూరి అడిగిన సినిమా ను చేయలేనందుకు ఫీల్ అయినట్లుగా కంగనా పేర్కొంది. ఇక కంగనా రనౌత్‌ మళ్లీ ఛాన్స్ వస్తే సౌత్ లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.