Begin typing your search above and press return to search.

'మ్యాడ్' డైరెక్టర్.. లక్కు బాగుంది!

గత ఏడాది చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిన 'మ్యాడ్' ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అందుకుంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:30 PM GMT
మ్యాడ్ డైరెక్టర్.. లక్కు బాగుంది!
X

గత ఏడాది చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిన 'మ్యాడ్' ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అందుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేశారు. సంతోష్ శోభన్, నార్నే నితిన్, నితిన్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యాడు.

డెబ్యూ మూవీ తోనే తన రైటింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న ఈ దర్శకుడికి తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో రెండు సినిమాలు చేసేందుకు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అవ్వకముందు కళ్యాణ్ శంకర్ నవీన్ పోలిశెట్టి నటించిన 'జాతి రత్నాలు' సినిమాకి రైటర్ గా పని పనిచేశాడు. జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ కావడంతో రైటర్ గా కళ్యాణ్ శంకర్ కి మంచి గుర్తింపు తెచ్చింది.

ఇందులో భాగంగానే సితార లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ ఇతని టాలెంట్ ని మెచ్చి సినిమా చేసే అవకాశం కల్పించింది. అలా 'మ్యాడ్' మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ అదే సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో మెరిశాడు. ఇక రిలీజ్ తర్వాత యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు అదే సితార ఎంటర్టైన్మెంట్స్ తో రెండు సినిమాలు చేసేందుకు డీల్ కుదిరింది. అందులో ఒకటి 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ 2' కాగా మరొకటి యంగ్ హీరో శర్వానంద్ తో మరో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. 'మ్యాడ్ 2' పూర్తయిన తర్వాతే శర్వానంద్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.

ఇక 'మ్యాడ్ 2' షూటింగ్ మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ లో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మొదటి సినిమాతోనే సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఒకేసారి రెండు సినిమాలు చేసేందుకు డీల్ కుదుర్చుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.