Begin typing your search above and press return to search.

దేవర.. కళ్యాణ్ రామ్ క్లియర్ క్లారిటీ

ఆ సమయంలో నందమూరి ఫ్యాన్స్.. దేవర అప్డేట్ కావాలంటూ అరిచారు. దీంతో కల్యాణ్​ రామ్.. ఎన్టీఆర్​ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:03 PM GMT
దేవర.. కళ్యాణ్ రామ్ క్లియర్ క్లారిటీ
X

ఆర్​ఆర్​ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్​లో ప్రస్తుతం తారక్​ ఫుల్​ బిజీగా ఉన్నారు. ఆర్​ఆర్​ఆర్​ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్​ చేస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్​ తదితరుల ఫస్ట్ లుక్స్ రిలీజై ఆకట్టుకున్నాయి. దీంతో ఫ్యాన్స్​ దేవర కొత్త అప్డేట్​ కోసం ఫ్యాన్స్​ వెయిట్ చేస్తున్నారు.

తాజాగా హీరో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన కొత్త సినిమా డెవిల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో అభిమానుల సమక్షంలో గ్రాండ్​గా జరిగింది. ఈ సందర్భంగా గతేడాది విడుదలైన బింబిసార సినిమా సీక్వెల్‌ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఆ సమయంలో నందమూరి ఫ్యాన్స్.. దేవర అప్డేట్ కావాలంటూ అరిచారు. దీంతో కల్యాణ్​ రామ్.. ఎన్టీఆర్​ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"తమ్ముడు అప్డేట్స్ చెప్పొద్దన్నాడు. కానీ ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత నటులు, దర్శకుడు, నిర్మాతలకు తర్వాత చిత్రాల విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. కథ, విజువల్స్‌ ఇలా ఎందులోనైనా ఒకవేళ తప్పు జరిగితే మీరు (ఫ్యాన్స్​) ఊరుకుంటారా? మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని మిమ్మల్ని అలరించేందుకు ఎంతో కష్టపడతాం. త్వరలో గ్లింప్స్‌ రాబోతుంది.

సంబంధిత పనులు జరుగుతున్నాయి. దేవరతో మీకో కొత్త ప్రపంచం చూపించబోతున్నాం. మేమంతా చర్చించుకుని గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్‌ త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టండి" అని కల్యాణ్​ రామ్​ విజ్ఞప్తి చేశారు.

ఇక సినిమా విషయానికొస్తే.. రెండు భాగాలుగా రూపొందుతున్న దేవరకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.