Begin typing your search above and press return to search.

కల్కి.. ఇంతకీ అల్లుడి రెమ్యునరేషన్ ఎంత?

టాలెంటెడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్.

By:  Tupaki Desk   |   26 April 2024 1:30 PM GMT
కల్కి.. ఇంతకీ అల్లుడి రెమ్యునరేషన్ ఎంత?
X

టాలెంటెడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. చేసినవి రెండు సినిమాలే అయిన వాటి కోసం అతను ఎంచుకున్న కథలు, డీల్ చేసిన విధానం చూసిన తర్వాత కచ్చితంగా స్టార్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని అందరూ భావించారు. ఆ దిశగానే ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రయాణం సాగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898AD చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే పనిలో ఉన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పార్ట్ 1 త్వరలో విడుదల కానుంది.

నాగ్ అశ్విన్ తో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లలో అశ్వినీదత్ అతని కుమార్తె స్వప్నదత్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు వైజయంతీ మూవీస్ కి లాభాలతో పాటు అవార్డులు కూడా తెచ్చి పెట్టాయి. ఇప్పుడు కల్కి 2898ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మొదటి రెండు సినిమాలకి నాగ్ అశ్విన్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 2015లో నాగ్ అశ్విన్ అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బయటి నుంచి ఆఫర్స్ వచ్చిన కూడా నాగ్ అశ్విన్ ఎవరికి మూవీస్ చేయడం లేదు. మామయ్య ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ వైజయంతీని మరో లెవెల్ కు తీసుకు వెళ్లే బాధ్యతను తనే తీసుకున్నట్లు అనిపిస్తుంది.

అశ్వినీదత్ కూడా అల్లుడు మీద నమ్మకంతో కల్కిపై భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతున్నారు. ఒక సినిమాపై 500 కోట్లు ఖర్చు పెట్టడం ఆయనకు ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. హీరో ప్రభాస్ - అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె అలాగే స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ కు కలిపి 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్లు టాక్.

అయితే అశ్వినీ దత్ అల్లుడికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదంట. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ ప్రకారం నాగ్ అశ్విన్ కి కల్కి 2898ఏడీ చిత్రం ద్వారా 50 కోట్లకు పైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బిజినెస్ పెరిగి మరింత లాభాలు వస్తే నాగ్ అశ్విన్ కి మూవీ ద్వారా వచ్చే ప్రాఫిట్ కూడా పెరగనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కూడా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.