Begin typing your search above and press return to search.

తండ్రి కొడుకులు భోజనంతో చంపేస్తారు: ఎన్టీఆర్

ప్రభాస్ తారక్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అర్జెంట్ గా భోజనానికి వచ్చేసేయ్ అని అంటే ఈ తండ్రికొడుకులు భోజనం పెట్టి చంపేస్తారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారంట.

By:  Tupaki Desk   |   9 March 2024 3:53 AM GMT
తండ్రి కొడుకులు భోజనంతో చంపేస్తారు: ఎన్టీఆర్
X

డార్లింగ్ ప్రభాస్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఏదైనా షూటింగ్ లో పాల్గొంటే అక్కడ ఉన్న సెలబ్రెటీలు అందరికి ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చి పెడతారు. ప్రభాస్ తీసుకొచ్చే ఫుడ్ కూడా అంతే ఇష్టంగా అందరూ తింటారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రభాస్ ఆతిథ్యం స్వీకరిస్తూ ఉంటారు

హీరోయిన్స్ కూడా చాలా సందర్భాలలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. విదేశాలలో షూటింగ్ ఉంటే ప్రభాస్ తనకోసం ప్రత్యేకంగా ఫుడ్ వండటం కోసం ఒక వంటమనిషిని పెట్టుకుంటాడు. బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయడు. అలాగే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా సినిమా షూటింగ్ లు చేసే సమయంలో ఇంటిభోజనం తెప్పించి అందరికి పెట్టేవారంట..

అలా తండ్రి వారసత్వాన్ని ఇండస్ట్రీ ప్రభాస్ కొనసాగిస్తున్నాడు. తాజాగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా ఆమె ఓ టీవీ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ సందర్భంగా ఇంటిభోజనం తీసుకొచ్చి అందరికి పెట్టింది. అలాగే కృష్ణంరాజు జ్ఞాపకాలు కూడా స్టేజ్ మీద పంచుకున్నారు. కృష్ణంరాజుకి ఏవైతే ఇష్టమో వాటిని కొనసాగించడం నాకిష్టం అంటూ శ్యామలాదేవి పేర్కొన్నారు.

డార్లింగ్ ప్రభాస్ ఇతర హీరోలతో మంచి అనుబంధం కలిగి ఉంటాడని పేర్కొన్నారు. ప్రభాస్ తారక్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అర్జెంట్ గా భోజనానికి వచ్చేసేయ్ అని అంటే ఈ తండ్రికొడుకులు భోజనం పెట్టి చంపేస్తారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారంట. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రభాస్ ఆతిథ్యం స్వీకరిస్తూ ఉంటారని ఆమె మాటలబట్టి అర్ధమవుతోంది.

కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఇంటి భోజనం తెప్పించి ఆర్టిస్టులందరికి పెట్టే పద్ధతి స్టార్ట్ చేశారు. దానిని ప్రభాస్ కూడా కొనసాగిస్తూ కృష్ణంరాజుకి సరైన వారసుడు అనిపించుకుంటున్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఒక హీరోని అభిమానించే వారు ఇంకో హీరోని అభిమానించరు. కానీ హోల్ సేల్ గా అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని మెచ్చుకుంటూ పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజా సాబ్ కూడా షూటింగ్ దశలో ఉంది.