నీల్ విధ్వంసంలోకి ఎన్టీఆర్.. గెట్ రెడీ!
ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం… ఎన్టీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ మూవీ షూట్లో జాయిన్ కానున్నాడు.
By: Tupaki Desk | 9 April 2025 8:18 AMదేవర సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. "ఆర్ ఆర్ ఆర్"తో గ్లోబల్ లెవెల్కి వెళ్లిన తారక్, ఇప్పుడు అదే స్థాయిలో వరుసగా భారీ చిత్రాల్ని లైన్లో పెట్టాడు. వార్ 2 షూటింగ్తో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా మీద కూడా ఆయన పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచే ఎన్టీఆర్ అభిమానుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది.
ప్రశాంత్ నీల్ మాస్ స్క్రీన్ ప్లే, ఎన్టీఆర్ మాస్ పెర్ఫార్మెన్స్ కలిస్తే బిగ్ స్క్రీన్ పై విధ్వంసమే అనేలా ఫ్యాన్స్ కామెంట్స్ వస్తున్నారు. ఈ కాంబినేషన్ మరింత హైపర్ లెవెల్కు తీసుకెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అనౌన్స్మెంట్ నుంచే ఈ కాంబినేషన్పై అంచనాలు మోస్తరుగా ఉండలేదు. గతంలో ప్రశాంత్ నీల్ "కేజీఎఫ్" ద్వారా తన మార్క్ చూపించాడు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్ను ఎలా మాస్గా చూపించనున్నాడో అనే విషయమే ఈ సినిమాకు బజ్ను తీసుకొచ్చింది.
ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం… ఎన్టీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ మూవీ షూట్లో జాయిన్ కానున్నాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. "#NTRNeel బ్లాస్ట్ చెందుకు సిద్ధమవుతున్నట్టు" అంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి సినిమా ఎక్కువ భాగం ఎన్టీఆర్ పైనే సాగనుందనే మూడ్ క్రియేట్ చేశారు. ఈ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇదే పోస్టర్లో ఉన్న “డిస్ట్రక్టివ్ సోయిల్” అనే పదాలే ఈ సినిమా టోన్ ఎలా ఉండబోతోందో చెబుతున్నాయి.
ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో షూటింగ్ మొదలైంది. జూనియర్ ఆర్టిస్టులపై కొన్ని సీన్లు షూట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంట్రీతో అసలైన షూటింగ్ శరవేగంగా సాగనుంది. దీని తర్వాత మూడో షెడ్యూల్ కూడా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కావడం వల్లే షూటింగ్ డేలు, ప్రొడక్షన్ విలువల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్లానింగ్ చేస్తున్నారు.
హీరోయిన్గా రుక్మిణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే కన్నడలో మంచి గుర్తింపు ఉంది. అటువంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ను ఎన్టీఆర్ పక్కన తీసుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో, విజువల్గా ఇది మరో స్థాయిలో ఉండబోతుందని సమాచారం.
ఇప్పటికే జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఏప్రిల్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుకు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ టార్గెట్ చేయడం వల్ల భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇది కేవలం టాలీవుడ్కు మాత్రమే కాదు, బాలీవుడ్లోనూ ఎన్టీఆర్ క్రేజ్ను పెంచేలా ఉంటుందని అంచనా. ప్రశాంత్ నీల్ మాస్ టచ్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే ఎలాంటి సంచలనం క్రియేట్ అవుతుందో చూడాల్సిందే. ఏప్రిల్ 22నుంచి ఈ సినిమా ఎక్స్ప్లోసివ్ మోడ్లోకి ప్రవేశించనుంది.