Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 రిలీజ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సగానికి చేరిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 May 2025 2:30 AM
ఎన్టీఆర్ సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
X

సలార్ 1 తర్వాత సలార్ 2 కి కొంత గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా లెవెల్ లో అతను సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సలార్ 1ని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా తీశాడు. ఐతే ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది.

ఐతే కె.జి.ఎఫ్ రెండు భాగాలు చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కథను కూడా రెండుగా డివైడ్ చేశాడు. ఐతే నెక్స్ట్ చేస్తున్న తారక్ సినిమా కూడా రెండు భాగాలనే చెబుతున్నారు. ఐతే ఎన్టీఆర్ సినిమాతో ఈ రెండు భాగాల సెంటిమెంట్ కి బ్రేక్ ఇస్తాడంటూ ఒక చర్చ నడుస్తుంది. కె.జి.ఎఫ్ 1, 2 కాదు చివర్లో 3 కూడా చూపించాడు. సలార్ ని కూడా రెండు చేస్తున్నాడు. ఐతే ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ సినిమాతో ఆపేయాలని చూస్తాడా అని చర్చిస్తున్నారు.

అలా చేస్తే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ గానే వస్తుంది. ఐతే ఫ్యాన్స్ మాత్రం ఎన్ టీ ఆర్ సినిమా కూడా రెండు భాగాలుగా కావాలని కోరుతున్నారు. వాళ్ల కోసమైనా ఈ మూవీని రెండు భాగాలుగా చేస్తారేమో చూడాలి. ఐతే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఎన్ టీ ఆర్ అంటేనే మాస్ హీరో అలాంటి హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 రిలీజ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సగానికి చేరిందని తెలుస్తుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఈమధ్య స్టార్ సినిమాను భారీ బడ్జెట్ పెట్టేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా సరే రెండు భాగాలు తీస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అలా కాకుండా ఒకే ప్రాజెక్ట్ గా వదిలితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందనిపిస్తుంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.