Begin typing your search above and press return to search.

జిగర్తాండ డబుల్‌ X టీజర్​.. ఊరమాస్​ సీక్వెల్

తాజాగా ఈ చిత్ర టీజర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా స్టార్స్​ మహేశ్​ బాబు, ధనుశ్​, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి.. వారి భాషల్లో రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 10:00 AM GMT
జిగర్తాండ డబుల్‌ X టీజర్​.. ఊరమాస్​ సీక్వెల్
X

రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ఎక్స్‌'. 8 ఏళ్ల కింద రిలీజై సంచలన విజయం అందుకున్న జిగర్తాండ చిత్రానికి సీక్వెల్​గా వస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా స్టార్స్​ మహేశ్​ బాబు, ధనుశ్​, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి.. వారి భాషల్లో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్​లో లారెన్స్‌ గన్స్‌ పట్టుకుని, బీడీ తాగుతూ పక్కా మాస్‌ అవతారంలో కనిపించగా.. ఎస్‌జే సూర్య సూట్‌ వేసుకుని స్టైల్‌గా కనిపించారు.

కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిమిషా సజయన్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. 2009లో వచ్చిన జిగర్తాండ చిత్రాన్ని.. ఈ జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్ గుర్తు చేస్తోంది. ఓ ఫిల్మ్ మేకర్, గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఓ పక్కా క్రైమ్ కథ కోసం వెతుకుతున్న డైరెక్టర్​కు.. ఓ రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ తన బయోపిక్​నే సినిమాగా తీయాలని చెప్పడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

ఈ జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్​లో డైరెక్టర్ పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించగా.. గ్యాంగ్‌స్టర్ పాత్రను రాఘవ లారెన్స్ పోషించారు. టీజర్​లో అన్ని భాషల వరకు కనెక్ట్​ అయ్యేలా ఇంగ్లిష్ డైలాగ్స్ మాత్రమే పెట్టారు. 1975 బ్యాక్​డ్రాప్​లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బ్యాక్​డ్రాప్​ అంతా ఆ వాతావరణాన్ని బాగానే క్రియేట్ చేశారు మేకర్స్. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ కూడా చాలా బాగుంది. ​లారెన్స్​, సూర్య లుక్స్​, యాక్టింగ్​ ఇంట్రెస్ట్​ కలిగిస్తోంది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో వెస్టర్న్ మేకింగ్ కూడా కనిపిస్తోంది. అందుకే రెండింటినీ కలిపి పాన్ ఇండియాను కాస్త పాండ్యా వెస్టర్న్​గా రాబోతున్నట్లు వీడియోలో చూపించారు మేకర్స్​. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్​పై నిర్మించారు. కార్తికేయన్‌ సంతానం సహా నిర్మాతగా వ్యవహరించారు.

చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ బడ్జెట్​తో రూపొందించినట్లు మూవీటీమ్ చెప్పింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు గ్లింప్స్​లో తెలిపారు మేకర్స్​. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. షూటింగ్​ కూడా ఇప్పటికే పూర్తైపోయింది.