Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ తర్వాత చరణ్‌ తో ఆమె...!

తాజాగా రామ్‌ చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2023 5:29 AM GMT
ఎన్టీఆర్‌ తర్వాత చరణ్‌ తో ఆమె...!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు. అయినా కూడా స్టార్ కిడ్‌ అవ్వడంతో ఆఫర్లు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే టాలీవుడ్‌ లో ఈ అమ్మడి క్రేజ్‌ మామూలుగా లేదు.


ఇప్పటికే ఎన్టీఆర్‌ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తోంది. దేవర రెండు పార్ట్‌ లు గా రాబోతున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌ ల్లో కూడా జాన్వీ కపూర్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటూ మేకర్స్‌ బలంగా చెబుతున్నారు. దేవర తో పాటు జాన్వీ మరే తెలుగు సినిమాను చేయడం లేదు.

ఇప్పటికే ఆమె వద్దకు కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా నో చెప్పింది. టాలీవుడ్‌ లో కంటే బాలీవుడ్‌ లో హిట్‌ అవ్వాలి.. అక్కడ మంచి విజయాలు సొంతం చేసుకోవాలనే కోరిక ఆమెకు స్ట్రాంగ్‌ గా ఉంది. అందుకే ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదు అంటూ ఇన్ని రోజులు ప్రచారం జరిగింది.

తాజాగా రామ్‌ చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చి బాబు ఇప్పటికే జాన్వీ కపూర్ తో చర్చలు జరిపాడని.. దేవర సినిమా తర్వాత రామ్‌ చరణ్ తో కలిసి నటించేందుకు జాన్వీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

రామ్‌ చరణ్‌ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ సినిమాలో నటించేందుకు బాలీవుడ్‌ స్టార్‌ ముద్దుగుమ్మలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌ లో గుర్తింపు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఓకే చెప్పిందని టాక్‌ వినిపిస్తోంది.

మొత్తానికి ఎన్టీఆర్‌ దేవర సినిమా తర్వాత జాన్వీ కపూర్‌ తెలుగు లో రామ్‌ చరణ్‌ కి జోడీగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఒక వేళ చరణ్‌ కి జోడీగా జాన్వీ నటిస్తే కచ్చితంగా సూపర్ గా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.