Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌, చరణ్‌ ల కోసం సేమ్‌ టు సేమ్‌...!

హిందీలో గత కొంత కాలంగా వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న జాన్వీ ఎట్టకేలకు తెలుగు లో ఎంట్రీ కి సిద్దం అయ్యింది

By:  Tupaki Desk   |   21 March 2024 7:00 AM GMT
ఎన్టీఆర్‌, చరణ్‌ ల కోసం సేమ్‌ టు సేమ్‌...!
X

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లెజెంట్రీ స్టార్ హీరోయిన్‌ శ్రీదేవి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. హిందీలో గత కొంత కాలంగా వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న జాన్వీ ఎట్టకేలకు తెలుగు లో ఎంట్రీ కి సిద్దం అయ్యింది.

హిందీలో ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ కూడా దక్కించుకోలేక పోయిన జాన్వీ కపూర్ కి టాలీవుడ్‌ లో ఉన్న క్రేజ్‌, తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవికి ఉన్న పాపులారిటీ కారణంగా ఏకంగా ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్‌ లకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఎన్టీఆర్‌ కి జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఇటీవలే రామ్‌ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా జాన్వీ హాజరు అయిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలతో జాన్వీ కపూర్‌ కమర్షియల్‌ హిట్‌ ఖాతా తెరవాలని ఆశిస్తోంది.

ఈ రెండు సినిమాలకు కూడా సేమ్‌ టు సేమ్‌ లుక్ లో జాన్వీ కపూర్‌ కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. కథానుసారంగా రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ ను ఆయా సినిమాల దర్శకులు పల్లెటూరి అమ్మాయి పాత్రలో చూపించబోతున్నారు.

ఇప్పటికే దేవర లో జాన్వీ ఎలా ఉంటుంది అనేది చూపించారు. లంగా ఓనీ లో జాన్వీ కపూర్‌ ను చూడబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తో చెప్పారు. ఇక చరణ్‌, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయిగా చీర కట్టు లో, లంగా ఓని లో కనిపించబోతుందని సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో చేసిన పాత్రలకు చాలా విభిన్నంగా ఈ రెండు పాత్రలు ఉండబోతున్నాయి. ఇక సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు డీ గ్లామర్‌ లుక్‌ లో పల్లెటూరు అమ్మాయిగా రాబోతుంది. మరి మనోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.