Begin typing your search above and press return to search.

'ఊ అంటావా'ను కొట్టేలా జాన్వీతో ఐట‌మ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప: ది రైజ్'లో సమంత ఐటెం సాంగ్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 March 2024 3:55 AM GMT
ఊ అంటావాను కొట్టేలా జాన్వీతో ఐట‌మ్?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప: ది రైజ్'లో సమంత ఐటెం సాంగ్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ లో ఎవ‌రు క‌నిపిస్తారు? అనేదానిపై ఆరాలు తీస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇంత‌లోనే 'పుష్ప 2'లోని ఐటెమ్ సాంగ్ గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ స్పెషల్ నంబర్ కోసం దర్శకుడు సుకుమార్ జూ.అతిలోక‌ సుందరి జాన్వీ కపూర్‌ని సంప్ర‌దించార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ పాట 'పుష్ప: ది రైజ్'లోని స‌మంత‌ 'ఊ అంటావా..'ను కొట్టేలా ఉండాల‌ని అత‌డు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దేవీశ్రీ పెప్పీ నంబ‌ర్ కి అద్భుతమైన ట్యూన్ రెడీ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ స్పెష‌ల్ నంబ‌ర్ కు జాన్వీ ఓకే చెప్పిందా లేదా? అనేదానిపై అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. ప్రస్తుతం జాన్వీ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దేవర'లో ఎన్టీఆర్ సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న త‌దుప‌రి చిత్రంలో న‌టించేందుకు జాన్వీ ఓకే చెప్పింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు పుష్ప 2లో ఐటెమ్ నంబ‌ర్ కి ఓకే చెబితే జాన్వీకి మ‌రింత మైలేజ్ ని పెంచుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

పుష్ప 2లో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ అట‌వీశాఖ అధికారి పాత్రను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 15 ఆగస్ట్ 2024న ఈ చిత్రం విడుద‌ల కానుంది.