Begin typing your search above and press return to search.

సిగ్గుప‌డుతున్నా! న‌ట‌వార‌సురాలు ప‌శ్చాత్థాపం!!

చాలా మంది పొరుగు భాషా క‌థానాయిక‌లు టాలీవుడ్ కి వచ్చి స్వ‌చ్ఛ‌మైన తెలుగు భాష‌ మాట్లాడుతున్నారు

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:06 PM GMT
సిగ్గుప‌డుతున్నా! న‌ట‌వార‌సురాలు ప‌శ్చాత్థాపం!!
X

చాలా మంది పొరుగు భాషా క‌థానాయిక‌లు టాలీవుడ్ కి వచ్చి స్వ‌చ్ఛ‌మైన తెలుగు భాష‌ మాట్లాడుతున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి, త‌మ‌న్నా లాంటి సీనియ‌ర్ భామ‌ల‌తో పాటు నివేద థామ‌స్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లాంటి జూనియ‌ర్ భామ‌లు ఉన్నారు. అయితే ఇలియానా, త్రిష లాంటి క‌థానాయిక‌లు ఎప్ప‌టికీ తెలుగు మాట్లాడ‌లేక‌పోతున్నందుకు ప‌శ్చాత్తాపానికి గుర‌య్యారు. ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ నుంచి తెలుగులో అడుగుపెడుతున్న యువ‌త‌రం నాయిక‌లు తెలుగు నేర్చుకోవాల‌ని ఎంతగా త‌పిస్తున్నారో చూస్తున్నాం. ఇంత‌కుముందు 'లైగ‌ర్' ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో తెలుగు మాట్లాడేందుకు అన‌న్య పాండే చాలా త‌పించింది. ప్ర‌స్తుతం దేవ‌ర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అన‌న్య స్నేహితురాలు, శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కూడా క‌ల‌త‌కు గుర‌వుతోంది.

త‌న‌ను బాధ‌కు గురి చేస్తున్న భాష గురించి జాన్వీ స్వ‌యంగా మాట్లాడింది. తాను 'దేవ‌ర‌' చిత్రంలో దిగ్గ‌జాల‌తో క‌లిసి న‌టిస్తున్నాన‌ని, ఇంకా తెలుగు నేర్చుకోలేక‌పోయినందుకు సిగ్గుప‌డుతున్నాన‌ని జాన్వీ అంది. అంతేకాదు.. త‌న డైలాగ్స్ వ‌చ్చే స‌మ‌యానికి అంద‌రూ స‌హ‌క‌రిస్తూ ఎలాంటి క‌ష్టం తెలియ‌నీకుండా చేస్తున్నార‌ని అందుకు వారికి ధ‌న్య‌వాదాలు అని కూడా జాన్వీ క‌పూర్ అన్నారు.

ది వీక్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ త‌న విచారం వ్య‌క్తం చేసింది. నిన్న రాత్రి దేవర డైలాగ్‌లను అందుకున్నాను. నా గదిలో కూర్చుని నా లైన్లు నేర్చుకోవడమే నేను చేయాల్సిన‌ది అని తెలిపారు. ఎప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. ఇందుకు సిగ్గుపడుతున్నాను. శబ్దపరంగా అర్థం చేసుకోగలను.. కానీ మాట్లాడలేను. ఇందుకు బాధ‌గా ఉంద‌ని జాన్వీ అంది. చాలా ఓపిగ్గా నా తెలుగు డైలాగుల కోసం చిత్ర‌బృందం స‌హ‌క‌రిస్తున్నార‌ని జాన్వీ కాంప్లిమెంట్లు ఇచ్చారు. దేవ‌ర అక్టోబ‌ర్ 10 న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.