Begin typing your search above and press return to search.

మెకాళ్ల‌పై తిరుమ‌ల మెట్లుక్కుతూ జెన్ Z జాన్వీ

తెలుగు చిత్ర‌సీమ‌లో ఆరంగేట్ర‌మే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో అవ‌కాశాలు అందుకుంది.

By:  Tupaki Desk   |   21 March 2024 1:48 PM GMT
మెకాళ్ల‌పై తిరుమ‌ల మెట్లుక్కుతూ జెన్ Z జాన్వీ
X

టాలీవుడ్‌లో ఏ నోట విన్నా జాన్వీ గురించే ముచ్చ‌ట‌.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ క‌పూర్ అంద‌చందాలు.. న‌ట‌న‌తో మురిపిస్తోంది. తెలుగు చిత్ర‌సీమ‌లో ఆరంగేట్ర‌మే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో అవ‌కాశాలు అందుకుంది. దీంతో క్రేజ్ స్కైని ట‌చ్ చేస్తోంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ స‌ర‌స‌న `దేవ‌ర` చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ మొన్న‌టికి మొన్న రామ్ చ‌రణ్‌- బుచ్చిబాబు సినిమా ఆర్.సి 16 లాంచింగ్ వేడుక‌లో సంద‌డి చేసింది. ప‌ద్ధ‌తిగా చీర‌క‌ట్టులో క‌నిపించి తెలుగు యువ‌త‌ను క‌వ్వించింది.

అయితే ఆర్.సి 16 ప్రారంభోత్స‌వానికి ముందే జాన్వీ (27) త‌న పుట్టిన‌రోజున‌ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న సామిని సంద‌ర్శించుకునేందుకు త‌న‌ క‌జిన్.. ఒక‌ప్ప‌టి హీరోయిన్ మ‌హేశ్వ‌రి(శ్రీ‌దేవి సోద‌రి)తో క‌లిసి తిరుమ‌ల యాత్ర‌కు వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇంత‌కుముందే ఇంట‌ర్నెట్ లో రిలీజ‌య్యాయి. వెంక‌న్న సామి ద‌ర్శ‌నంలో జాన్వీ క‌పూర్ తో పాటు త‌న స్నేహితులు శిఖ‌ర్ ప‌హారియా, ఒర్రీ కూడా ఉన్నారు. జాన్వీ ఆ వీడియోలో చీర‌క‌ట్టులో ఎంతో అందంగా క‌నిపించింది.

ఇప్పుడు అదే భ‌క్తి యాత్ర‌కు సంబంధించిన మ‌రో కొత్త వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో ఒక స‌ర్ ప్రైజ్ ఉంది. జాన్వీ క‌పూర్ మెట్ల మార్గంలో న‌డుచుకుంటూ వెళ్లేప్పుడు మోకాళ్ల మిట్ట వ‌ద్ద‌ మోకాళ్ల‌పై న‌డుచుకుని వెళుతూ క‌నిపించింది. త‌న‌తో పాటే స్నేహితుడు శిఖ‌ర్ కూడా మోకాళ్ల‌పై న‌డిచాడు. వారితో పాటు ఒర్రీ కూడా ఈ యాత్ర‌లో ఉన్నాడు. ఒర్రీ స్వ‌యంగా ఈ వీడియోని షేర్ చేయ‌డంతో క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. అధునాత‌న భావ‌జాలం ఉన్న జెన్ జెడ్ స్టార్ జాన్వీ కపూర్ ఇలా మోకాళ్ల‌పై దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్ల‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌దే. కానీ వెంక‌టేశ్వ‌ర స్వామి గుడి అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని జాన్వీ అంది. తిరుమ‌ల‌కు ఇప్ప‌టికే 50 సార్లు వ‌చ్చాన‌ని తెలిపారు.

శిఖర్ పహారియా ఎవ‌రు? అటే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. జాన్వీ కపూర్ - శిఖర్ పహారియా క్లోజ్ ఫ్రెండ్స్. తరచుగా రెస్టారెంట్లు, పబ్బులు, ఈవెంట్‌లలో కనిపిస్తారు. వారు ఇప్పటి వరకు బహిరంగంగా తమ సంబంధాన్ని అంగీకరించలేదు.

జాన్వీ చివరిసారిగా వరుణ్ ధావన్ సరసన బవాల్ చిత్రంలో నటించింది. త‌దుప‌రి రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించనుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ - సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి దేవరలో న‌టిస్తోంది. ఇది డెబ్యూ సినిమా. ద్వితీయ ప్ర‌య‌త్నం రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌సి 16 లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సినిమా అధికారికంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.