జైపూర్ ఘటనపై జాన్వీ సీరియస్!
ఇదిలా ఉంటే సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క జాన్వీ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ వస్తోంది
By: Tupaki Desk | 1 May 2025 2:30 PMతెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తోంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కొరటాల శివ తెరకెక్కించిన `దేవర`తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ ఈ మూవీ సీక్వెల్తో పాటు తెలుగులో మరో భారీ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సాన బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న `పెద్ది`లో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీస్తో పాటు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క జాన్వీ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ వస్తోంది. పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నెట్టింట యాక్టీవ్గా ఉంటున్న జాన్వీ తాజాగా జైపూర్ ఘటనపై స్పందిస్తూ సీరియస్ అయింది. ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. దీనిపై స్పందించిన జాన్వీ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయింది.
మద్యం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. `ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా?..మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్నవారి ప్రాణాలను ప్రమాదంలో పడేయడం సరైనదేనని ఎవరైనా అనుకుంటారా? ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలను కోల్పోతున్నారు.
మరెంతో మంది గాయాలపాలవుతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు. కనీసం అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాం` అని జాన్వీ కపూర్ తన ఇన్స్టా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. రామ్ చరణ్తో కలిసి జాన్వీ నటించిన పెద్ది వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతోంది. ఇక ఎన్టీఆర్ `దేవర 2` కూడా త్వరలో ప్రారంభం కానుంది.