అక్షయ్, టైగర్ కోసం రకుల్ భర్త నరకం చూశాడా?
అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `బడేమియా -చోటేమియా`.
By: Tupaki Desk | 1 May 2025 12:30 PMఅక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `బడేమియా -చోటేమియా`. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మరో ముగ్గురితో కలిసి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ నిర్మించారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ రూ.100 కోట్లని అతి కష్టం మీద రాబట్టి భారీ షాక్ ఇచ్చింది. అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్ల కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్గా నిలిచి తీవ్ర నిరాశపరిచింది. ఈ మూవీ డిజాస్టర్ షాక్లో ఉన్న జాకీ భగ్నానీ ఏడాది తరువాత ఎట్టకేలకు స్పందించారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల తాము ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని, ఆస్తుల్ని తాకట్టుపెట్టామని, ఇలాంటి పరిస్థితి, బాధ ఎవరికీ కలగొద్దని, అయితే మా బాధ ఎవరికీ పట్టదన్నారు. జాకీ భగ్నానీ మాట్లాడుతూ `జీవితంలో నాకొక గుణపాఠాన్ని నేర్పిన సినిమా ఇది. దీని కోసం మేము భారీ స్థాయిలో ఖర్చు పెట్టాం. ఒక ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించడం ముఖ్యంకాదనే విషయాన్ని సినిమా విడుదలయ్యాక గ్రహించాం.మా కంటెంట్తో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని తెలుసుకున్నాం.
ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. మా కంటెంట్ వాళ్లకు ఎందుకునచ్చలేదనే విషయాన్ని మేం పునరాలోచించుకోవాలి. అంతే కానీ వాళ్ల నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దానిని ఒక పాఠంగా గ్రహించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా` అన్నాడు. ఇక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ `బాక్సాఫీస్ వద్ద మా సినిమా 50 శాతం కంటే తక్కువే కలెక్షన్లు వసూలు చేసింది. మా బాధ ఎవరికీ అర్థం కాదు. దీని కోసం మేం మా ఆస్తులు తాకట్టు పెట్టాం.
ఇలాంటి విషయాలు చెప్పినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు. లాభాలు వస్తాయనే ఉద్దయేశ్యంతో సినిమా నిర్మించామని, అయితే తాము అనుకున్నది మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. `బడేమియా చోటేమియా ప్రాజెక్ట్తో జాకీ భగ్నానీతో పాటు మరో ముగ్గురు నిర్మాతలు రూ.250 కోట్లకు పైగా నష్టపోయారు. మరి దీనిపై వారు ఎలా కోలుకుంటారో వేచి చూడాల్సిందే.