Begin typing your search above and press return to search.

సమంత ట్రీట్మెంట్ ముగిసినట్లేనా..?

ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా చెప్పారు. బిగ్ బాస్ లాంఛింగ్ ఈవెంట్ లో నాగార్జునతో మాట్లాడుతూ, సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లిందని.

By:  Tupaki Desk   |   4 Sep 2023 12:27 PM GMT
సమంత ట్రీట్మెంట్ ముగిసినట్లేనా..?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకు కేవలం తెలుగులోనే కాకుండా, దక్షిణాదిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తర్వాత ఆమెకు నార్త్ లోనే ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అందుకే ఆమెకు ఇప్పటికీ వరస ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ ఖుషీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.

అయితే, ఈ మూవీ విడుదలకు ముందే సమంత అమెరికా వెళ్లిపోయారు. అక్కడ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఆమె సందడి చేశారు. అయితే, నిజానికి సమంత వెళ్లింది చికిత్స తీసుకోవడానికి . కానీ, సమంత అమెరికా వెళ్లిన దగ్గర నుంచి ఖుషీ ప్రమోషన్స్ తదితర కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. ఇంతలోనే ఆమె భారత్ కి తిరిగి వచ్చేసిందంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా చెప్పారు. బిగ్ బాస్ లాంఛింగ్ ఈవెంట్ లో నాగార్జునతో మాట్లాడుతూ, సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లిందని, మరో రెండు, మూడు రోజుల్లో సమంత భారత్ వచ్చేస్తుందని చెప్పేశాడు. చిత్ర బృందం కూడా సమంత వచ్చిన తర్వాత పోస్ట్ ప్రమోషన్ పనులు చేపట్టాలని అనుకుంటున్నారట.

దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ ప్రమోషన్స్ లో సమంత ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో, సమంత హైదరాబాద్ కి వచ్చేశఆరట. అసలు, ఈ కొద్ది రోజుల్లో చికిత్స తీసుకోవడం అయిపోయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. లేకపోతే, ఈ ప్రమోషన్స్ తర్వాత ఆమె మళ్లీ అమెరికా వెళ్తుందేమో చూడాలి.

ఖుషీ మూవీ విషయానికి వస్తే, ఇక, ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్. ఈ మూవీ లో సమంత, విజయ్ ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఫ్యాన్స్ కి మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది.