Begin typing your search above and press return to search.

గురూజీ పెన్ను పదును పెడుతున్నాడా..?

ఆ సినిమాకు అదే చాలనుకున్నాడో లేక మరో కారణమో కానీ త్రివిక్రం సినిమాలో ఉండాల్సిన కొన్ని మాటలు గుంటూరు కారంలో మిస్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   2 Feb 2024 1:30 PM GMT
గురూజీ పెన్ను పదును పెడుతున్నాడా..?
X

రైటర్ గా ఉన్నప్పుడు డైరెక్టర్ గా మారిన తర్వాత ఎప్పుడు కూడా తన పెన్ను పవర్ ని ఎక్కడ తక్కూ కాకుండా చూస్తూ వచ్చిన త్రివిక్రం రీసెంట్ గా మహేష్ తో చేసిన గుంటూరు కారం సినిమాలో మాత్రం తన పెన్ను సరిగా వాడలేదని టాక్ వచ్చింది. త్రివిక్రం నుంచి కోరుకునే కొన్ని డైలాగ్స్ సినిమాలో మిస్ అయ్యాయి. ఆ సినిమాకు అదే చాలనుకున్నాడో లేక మరో కారణమో కానీ త్రివిక్రం సినిమాలో ఉండాల్సిన కొన్ని మాటలు గుంటూరు కారంలో మిస్ అయ్యాయి.

అందుకే సినిమా చూసిన వారంతా కూడా మహేష్ బాబు హిట్టు త్రివిక్రం ఫెయిల్ అని అన్నారు. ఎలాగోలా వసూళ్ల పరంగా గుంటూరు కారం హిట్ అనిపించుకున్నా త్రివిక్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని మాత్రం సినిమా నిరుత్సాహ పరచింది. డిజాస్టర్ అనిపించుకున్న అజ్ఞాతవాసి సినిమాలో కూడా పవన్ తన డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఆ సినిమాలో కుర్చీ గురించి పవన్ చెప్పే డైలాగ్ ఇది కదా త్రివిక్రం అనేలా చేసింది.

అయితే గుంటూరు కారం సినిమా ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్న గురూజీ తన నెక్స్ట్ సినిమా కోసం పెన్ను పదును పెడుతున్నాడట. అసలైతే త్రివిక్రం నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ పుష్ప 2 తర్వాత బన్నీతో సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. మరి త్రివిక్రం తో సినిమానే మొదట చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

త్రివిక్రం మాత్రం అల్లు అర్జున్ అయినా ఓకే మరో హీరోయిన్ అయినా ఓకే కానీ ఈసారి మాత్రం తన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అంతా మళ్లీ తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా మాటలు రాయాలని ఫిక్స్ అయ్యాడు. అల్లు అర్జున్ కాకపోతే రాం, రవితేజ, నాని ఇలా టైర్ 2 హీరోల వైపు చూస్తున్నాడట త్రివిక్రంల్. వీరిలో ఎవరితో సినిమా ఓకే అవుతుంది అన్నది మాత్రం మరికొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

గుంటూరు కారం కథ గురించి కూడా మీడియాలో కొంత అనవసరమైన డిస్కషన్స్ జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి కథ మాటలు అందరిని సర్ ప్రైజ్ చేసేలా గురూజీ ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా త్రివిక్రం తో నెక్స్ట్ సినిమా తీసే హీరో వెరీ లక్కీ అని చెప్పొచ్చు.