Begin typing your search above and press return to search.

చెప్ప‌కుండా పెళ్లాడాను.. అమ్మ క‌న్నీళ్లు పెట్టుకుంది!

తాజాగా సైఫ్ త‌న త‌ల్లి గారైన షర్మిలా ఠాగూర్ తో క‌లిసి కరణ్ జోహార్ కాఫీ సోఫాలో కనిపించారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 7:25 PM GMT
చెప్ప‌కుండా పెళ్లాడాను.. అమ్మ క‌న్నీళ్లు పెట్టుకుంది!
X

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇటీవ‌ల తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇంత‌కుముందు ప్ర‌భాస్ న‌టించిన `ఆదిపురుష్`లో రావ‌ణ్ పాత్ర‌ను పోషించిన అత‌డు త‌దుప‌రి ఎన్టీఆర్ `దేవ‌ర‌`లోను విల‌న్ గా న‌టిస్తున్నాడు. తెలుగు ప్ర‌జ‌ల‌కు సైఫ్‌లోని విల‌క్ష‌ణ న‌టుడు ప‌రిచ‌యం అవుతున్నాడు.

తాజాగా సైఫ్ త‌న త‌ల్లి గారైన షర్మిలా ఠాగూర్ తో క‌లిసి కరణ్ జోహార్ కాఫీ సోఫాలో కనిపించారు. ఈ వేదిక‌పై సైఫ్ చిన్ననాటి చేష్టలు, అమృతా సింగ్‌తో అతని మొదటి వివాహం త‌దిత‌ర విష‌యాల‌పై ష‌ర్మిల ఎలా స్పందించారో చర్చించారు. పెళ్లి విషయం షర్మిలకు ఒకరోజు తర్వాత తెలియజేశానని, ఆమె బాధపడి ఏడ్చిందని సైఫ్ ఖాన్ వెల్లడించాడు. అమృత నుండి విడిపోవాలనే సైఫ్ నిర్ణయానికి షర్మిల తన మద్దతును వ్యక్తం చేసింది. విడిపోయిన తర్వాత సవాలుగా మారే విష‌యాల‌ను వివ‌రించారు ష‌ర్మిల‌.

అమృత‌ను పెళ్లాడిన‌ప్పుడు షర్మిల ముంబైలోనే ఉన్నారని కూడా సైఫ్‌ వెల్లడించాడు. ఆ వివాహానికి వ్యతిరేకంగా తన తల్లి తనకు ఎలాంటి సలహా ఇచ్చిందో అత‌డు వివరించాడు. అయితే త‌న పెళ్ల‌యింద‌ని తెలిసిన త‌ర్వాత ``అమ్మ కంటి నుండి కన్నీరు జ‌ల‌జ‌లా కారింది. అమ్మ ఏడ్చింది. నువ్వు నన్ను నిజంగా బాధపెట్టావు! అని ఆవేద‌న చెందింది.. అని సైఫ్‌ గుర్తుచేసుకున్నాడు. తాను అమృత నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు త‌న‌ను న‌మ్మిన‌ మొదటి వ్యక్తి తన తల్లి అని సైఫ్ పేర్కొన్నాడు. మామ్ తన నిర్ణయానికి మద్దతునిచ్చింది. విడిపోయిన తర్వాత సవాలుగా ఉన్న కాలాన్ని ఉద్దేశించి షర్మిల వివ‌రించింది. విడిపోవడం ఎప్పుడూ సులభం కాదని అంగీకరించింది. పిల్ల‌లు ఉన్న‌ప్పుడు ఇది చాలా క‌ష్ఠ‌త‌ర‌మైన ప్ర‌క్రియ అని తెలిపింది.

భార్య నుంచి విడిపోయిన తర్వాత `అంత బాగా లేని సమయం` గురించి సైఫ్‌ మాట్లాడాడు.. మీరు ఇంత కాలం కలిసి ఉన్నప్పుడు ..ఇంత అందమైన పిల్లలు ఉన్నప్పుడు.. విడిపోవడం సులభం కాదు. అప్పుడు అది సామరస్యం కాదు... నాకు తెలుసు. ఆ దశలో సామరస్యాన్ని కలిగి ఉండటం కష్టం.. అందరూ గాయపడ్డారు… కాబట్టి ఆ స‌న్నివేశం బాగాలేదు.. కానీ నేను ప్రయత్నించాను. కానీ అది వంతెన కింద నీరు.. ఆమెకు చల్లబరచడానికి సమయం కావాలి! అని విడాకుల గురించి వెల్లడించారు.

పటౌడీ కుటుంబానికి సంతోషకరమైన సమయం అది. ఎందుకంటే వారు కోడలు అమృతను మాత్రమే కాకుండా మనవరాలైన సారా అలీ ఖాన్.. మ‌న‌వ‌డు ఇబ్రహీం అలీ ఖాన్‌లను కూడా కోల్పోయారు. సంవత్సరాల తరబడి వేచి చూసాక‌ సైఫ్ -అమృత తమ విభేదాలను పరిష్కరించుకున్నారు. అయితే పిల్లలు సారా.. ఇబ్రహీంతో సైఫ్‌ ఎక్కువ సమయం గడిపారు. రెండో భార్య‌ కరీనా కపూర్ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్‌లతో ఫ్యామిలీ మీట్ ల‌లో తరచుగా సైఫ్ కలిసి కనిపిస్తారు.