Begin typing your search above and press return to search.

బార్బీ వరల్డ్ లోకి మన హీరోలు.. ఎలా మారిపోయారో చూశారా..?

కొందరు అభిమానులకు ఆ ఉత్సాహం వచ్చింది. అందుకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన హీరోలను బార్బీ ప్రపంచంలోకి పంపించేశారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 12:26 PM GMT
బార్బీ వరల్డ్ లోకి మన హీరోలు.. ఎలా మారిపోయారో చూశారా..?
X

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింట్లోనూ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది. ఈ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మన టాలీవుడ్ స్టార్ హీరోలను బార్బీ వరల్డ్ లోకి పంపించేశారు.


బార్బీని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. బార్బీ బొమ్మను పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే బార్బీ చూడటానికి అంత అందంగా ఉంటుంది. అంతేకాదు, మనకు బార్బీ అనగానే ముందు గుర్తుకువచ్చేది పింక్ కలర్. బార్బీ ప్రపంచం మొత్తం పింక్ మయంగా ఉంటుంది. మరి ఈ పింక్ ప్రపంచంలోని మన టాలీవుడ్ హీరోలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా?

కొందరు అభిమానులకు ఆ ఉత్సాహం వచ్చింది. అందుకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన హీరోలను బార్బీ ప్రపంచంలోకి పంపించేశారు. ఇంకేముంది మన హీరోలు సైతం పింక్ దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవర కొండ, మహేష్ బాబు, బన్నీ, ప్రభాస్ వీరందరినీ ఒకే ప్రేమ్ చేర్చారు.

ఇక, వారంతా నిజంగా బార్బీ వరల్డ్ లోకి అడుగుపెడితే, వీరు కూడా ఒక బార్బీ అయితే ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. ఈ ఫోటో చూడటానికి చాలా అందంగా ఉంది. పింక్ కలర్ షర్ట్ లో బ్రౌన్ హెయిర్ తో అందరూ మరింత హ్యాండ్సమ్ గా కనపడుతున్నారు. ఇంత డిఫరెంట్ గా తమ అభిమాన హీరోలను చూడటంతో ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోని షేర్ చేస్తుండటం విశేషం.

కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఓ ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో మన అందాల ముద్దుగుమ్మలు బార్బీ అవతారం ఎత్తారు. సమంత, తమన్నా, శ్రుతి హాసన్, త్రిష, నయనతార, కాజల్ లు బార్బీ గెటప్ లో ఉన్న ఫోటో సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.