Begin typing your search above and press return to search.

దర్శకుడు ఓకే చెప్తే నేను చూడను..!

యాక్షన్ హీరో గోపీచంద్‌ ప్రస్తుతం భీమా సినిమాను ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నాడు

By:  Tupaki Desk   |   4 March 2024 5:33 AM GMT
దర్శకుడు ఓకే చెప్తే నేను చూడను..!
X

యాక్షన్ హీరో గోపీచంద్‌ ప్రస్తుతం భీమా సినిమాను ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నాడు. ఈ వారంలోనే విడుదల అవ్వబోతున్న భీమా సినిమా కోసం గోపీచంద్‌ ఇంతకు ముందు సినిమాల కంటే కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్లుగా టీజర్ మరియు ట్రైలర్‌ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. భీమాతో హిట్ కొట్టగలను అనే నమ్మకం గోపీచంద్ లో కనిపిస్తోంది.

ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కెరీర్‌ ఆరంభం నుంచి కూడా షూటింగ్‌ చేసే సమయంలో మానిటర్ చెక్‌ చేసే అలవాటు లేదు. దర్శకుడు ఒక సీన్ ను చెప్తే దాన్ని బెస్ట్ ఔట్‌ పుట్‌ వచ్చే వరకు నేను చేస్తాను.

మానిటర్ లో చెక్‌ చేసుకుని బెటర్మెంట్‌ కోసం మళ్లీ చేయాలని నేను అనుకోను. ఎలాగూ దర్శకుడు మానిటర్ లో చెక్ చేసి తనకు ఓకే అనిపిస్తే ఓకే చెప్తాడు. ఒక వేళ మరో టేక్ కు వెళ్లాలి అంటే సరే అని మళ్లీ షాట్‌ కు రెడీ అవుతాను అంటూ గోపీచంద్‌ చెప్పుకొచ్చాడు.

దర్శకుడు ఓకే చెప్పే వరకు ఆ షాట్ ను చేస్తూనే ఉంటాను. దర్శకుడు ఓకే చెప్తాడు కనుక మానిటర్‌ లో చూడను అన్నట్లుగా గోపీచంద్‌ చెప్పుకొచ్చాడు. గోపీచంద్‌ వ్యాఖ్యలు కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా దర్శకుడి మాటపై వెళ్లడం అనేది మంచి నిర్ణయం అని, సీనియర్ నటుడు అయినా కూడా దర్శకుడిదే ఫైనల్ నిర్ణయం అంటూ చెప్పడం అభినందనీయం అంటున్నారు.

గోపీచంద్‌ ఇంకా మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌ వర్క్ సమయంలోనే దర్శకుడితో తన సందేహాలు అన్నీ కూడా నివృత్తి చేసుకుంటాను. ప్రతి విషయంలో కూడా క్లీయర్ గా, క్లారిటీగా ఉండే విధంగా చూసుకుంటాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఏదైతే అనుకున్నామో దాన్నే ఫైనల్ ఔట్‌ పుట్‌ గా తీసుకు వచ్చేందుకు చూస్తామని అన్నాడు.