Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బడా నిర్మాతలకి తమిళ హీరో గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్రాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   23 Nov 2023 11:30 PM GMT
టాలీవుడ్ బడా నిర్మాతలకి తమిళ హీరో గ్రీన్ సిగ్నల్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్రాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట యూఎస్ లో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది. దిల్ రాజు SVC అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఈ ప్రొడక్షన్ లొనే రూపొందుతున్నాయి.

సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ సంస్థ ఇప్పుడు పొరుగు బాషల్లో కూడా అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే మలయాళంలోకి అడుగు పెట్టిన మైత్రి మరోవైపు తమిళంలో కూడా సినిమాలు నిర్మించడానికి దారులు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ సంస్థతో ఇప్పుడు ఒక తమిళ అగ్ర హీరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అతను మరెవరో కాదు, అజిత్ కుమార్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా కమర్షియల్ సినిమాలతో మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్న అజిత్ డేట్స్ సంపాదించడం అంటే అంత సాదరణమైన విషయం కాదు. కానీ మైత్రి వాళ్ళు ధైర్యంతో ముందుగా హీరో డేట్స్ సెట్ చేసుకొని ఆ తరువాత దర్శకుడు స్టోరీ అంటు ముందుకు సాగారు. ఇక అజిత్ మైత్రి కాంబినేషన్ సినిమాకు డైరెక్టర్ గా ఆధిక్ రవిచంద్రన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇతను తెలుగు జనాలకు పెద్దగా పరిచయం లేకపోయినా తమిళంలో ఇటీవల విశాల్ తో మార్క్ ఆంటోని సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా తెలుగులో అంతగా క్లిక్ కాలేదు కానీ తమిళంలో మాత్రం ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఇక ఆధిక్ రవిచంద్రన్ కు విజయ్ అంటే పిచ్చ అభిమానం అని చాలా ఇంటర్వ్యూల ద్వారా క్లారిటీ వచ్చింది.

ఇప్పుడు మైత్రి వాళ్ళ ఆఫర్ తో అతను తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. ఇక మైత్రి వాళ్ళు తమిళంలో కూడా పట్టు సాధించాలని చూస్తున్న ప్రయత్నంకు అజిత్ ప్రాజెక్టు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటికే దిల్ రాజు విజయ్ వారసుడు సినిమాతో తమిళ మార్కెట్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు. మరి మైత్రి వాళ్ళకు అజిత్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.