Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ వేడుకలో మన ముద్దుగుమ్మలు

సౌత్‌ సినిమాల్లో నటించే ముద్దుగుమ్మలకు బాలీవుడ్‌ సినీ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడంతో పాటు, అక్కడ జరిగే అవార్డు వేడుకల్లో కూడా పాల్గొనే అవకాశాలు దక్కుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 April 2024 10:06 AM GMT
బాలీవుడ్‌ వేడుకలో మన ముద్దుగుమ్మలు
X

రాజమౌళి బాహుబలి మరియు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో పాటు మరికొన్ని సౌత్‌ సినిమాల కారణంగా బాలీవుడ్‌ లో మన స్టార్స్ కి సముచిత స్థానం దక్కుతుంది. గతంలో సౌత్‌ హీరోలు హీరోయిన్స్ అంటే బాలీవుడ్‌ వారు చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు సౌత్‌ స్టార్స్ కే ఎక్కువ క్రేజ్‌ ఇండియా వ్యాప్తంగా ఉండటంతో బాలీవుడ్‌ లో సముచిత స్థానం దక్కుతుంది.


సౌత్‌ సినిమాల్లో నటించే ముద్దుగుమ్మలకు బాలీవుడ్‌ సినీ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడంతో పాటు, అక్కడ జరిగే అవార్డు వేడుకల్లో కూడా పాల్గొనే అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్ 'హీరామండి' ప్రీమియర్ షో అట్టహాసంగా జరిగింది.


సంజయ్ లీలా భన్సాలీకి బాలీవుడ్‌ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున తారలు హీరామండి ప్రీమియర్ షో కు హాజరు అయ్యారు. అందులో మన సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్ కూడా ఉన్నారు. మన హీరోయిన్స్‌ భన్సాలీ సినిమా వేడుకలో కనిపించడం చాలా ప్రత్యేకమైన విషయం.


హీరామండి ప్రీమియర్ కి టాలీవుడ్‌ హీరోయిన్స్ రష్మిక మందన్న, మృణాల్‌ ఠాకూర్‌, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్, శృతి హాసన్‌ తో పాటు మరి కొందరు కూడా హాజరు అయ్యారు. ఓ భారీ అవార్డు వేడుకకి హాజరు అయినట్లుగా అందంగా ఆకర్షణీయంగా ఈ ముద్దుగుమ్మలు హాజరు అయ్యి అందరి దృష్టిని ఆకర్షించారు.